ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం వ‌రుస షాకుల‌తో విల‌విల్లాడుతోన్న విప‌క్ష టీడీపీకి ఇప్పుడు మ‌రో అదిరిపోయే షాక్ త‌గ‌ల‌నుంది. ఇప్ప‌టికే పార్టీ నుంచి గెలిచిన ఇర‌వై ముగ్గురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీని వీడి వైసీపీకి ద‌గ్గ‌ర‌య్యారు. ఇక ఇప్ప‌టికే చాలా మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం వైసీపీ లేదా బీజేపీలోకి వెళ్లి పోతున్నారు. ఇక తాజా షాకింగ్ న్యూస్ ఏంటంటే మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు, మ‌రో మాజీ మంత్రి సైతం టీడీపీని వీడి వైసీపీలోకి వెళుతున్న‌ట్టు తెలుస్తోంది.

 

త్వరలోనే టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి వైసీపీ కండువా కప్పుకోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడంతో వారిద్ద‌రు ఎవ‌రు ? అన్న దానిపై ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. ఇక వీరిలో ప్ర‌కాశం జిల్లాకు చెందిన వారిపై నే పెద్ద చ‌ర్చ న‌డుస్తోంది. ఈ జిల్లాకు చెందిన మాజీ మంత్రి పార్టీ మార్పుపై పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు..? మాజీ మంత్రి ఎవరనేదానిపై మాత్రం క్లారిటీ రాలేదు.

 

అయితే.. ప్రకాశం జిల్లాకు చెందిన నేతలే అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ వార్త‌లు జోరుగా వైర‌ల్ అవ్వ‌డంతో మాజీ మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావు క్లారిటీ ఇచ్చారు. ఆయ‌న మీడియా ముందుకొచ్చి తాను పార్టీ మార‌డం లేద‌ని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అదే జిల్లాకు చెందిన క‌ర‌ణం బ‌ల‌రాం ఇప్ప‌టికే పార్టీ మారిపోయారు. ఇక టీడీపీకి మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్‌, కొండ‌పి ఎమ్మెల్యే డోలా బాలా వీరాంజ‌నేయ స్వామి కూడా జంపింగ్ జాబితాలో ఉన్నారంటున్నారు. వీరిలో గొట్టిపాటి ర‌వికుమార్ గ‌తంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ త‌ర్వాత టీడీపీలోకి వెళ్లారు. ఇక ఇప్పుడు ఆయ‌న వ్యాపారాల‌పై దాడులు జ‌రుగుతోన్న నేప‌థ్యంలో ఆయ‌న వైసీపీలోకి వెళ్లే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు టాక్‌..?

మరింత సమాచారం తెలుసుకోండి: