భారత్ లో కరోనా వ్యాప్తి చెందుతుందని.. ఇప్పటికే 80 మందికి పైగా ఈ కోరానా సోకిందని.. ఇది మరింత తీవ్రం చూపిస్తుందని ప్రతిరోజూ వార్తలు చూస్తూనే ఉన్నాం.  అయితే కొంత మంద కరోనాను బూచీగా చూపిస్తూ లబ్ది పొందుతున్నారని.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కరోనా పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తారని తాము ఊహించలేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  మొదటి నుంచి టీడీపీ నేతలకు ఎన్నికల భయం పట్టుకుందని.. అప్పటి నుంచి ఎన్ని కుయుక్తులు పన్నాలో అన్ని పన్నుతున్నారని ఆయన అన్నారు.  అంతే కాదు ఈ మద్య రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారని అన్నారు. 

 

తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ... ఫ్రాన్స్ లో 127 మంది కరోనా కారణంగా చనిపోయారని  5,500 కరోనా కేసులు నమోదయ్యాయని, అయినా అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారని వెల్లడించారు.  ఏపీలో ఫ్రాన్స్ కంటే దారుణంగా ఏమీ లేదని స్పష్టం చేశారు.  ఇప్పటికేనా అసలు పరిస్థితులను ప్రజల ముందు ఉంచాలని.. కరోనా వల్ల ప్రమాదం ఉంది కానీ ప్రతిపక్షనేతలు చెప్పి భయపడేంతగా లేదని అన్నారు.  ఇది కేవలం ప్రతిపక్ష నేతల కుట్ర అని ఎన్నికలు వాయిదా వేయించాలనే తాప్రత్రయంతో ఈ పని చేశారని అన్నారు.  ఓ వ్యక్తికి మేలు చేసేందుకో, తన సామాజిక వర్గానికి చెందిన పార్టీ బాగు కోసమో ఎన్నికల కమిషనర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విచారించదగ్గ విషయం అని అభిప్రాయపడ్డారు ఇప్పటికైనా యథావిధిగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 

 

ప్రజలు నిజాలు గమనిస్తున్నారని... కుట్రలు పన్నేవారికి తగిన బుద్ది చెబుతారని.. ఇప్పుడు వాయిదా వేసినా ఎప్పటికైనా ఏపిలో వైసీపీ విజయఢంకా మోగిస్తుందని అన్నారు. ఈసీకి విచక్షణాధికారం ఉన్న మాట వాస్తవమేనని, అయితే తాజా నిర్ణయం విచక్షణ కోల్పోయి తీసుకున్నట్టు తెలుస్తోందని విమర్శించారు. విపక్షాలు తమ అభ్యర్థులను బరిలో నిలపలేక, ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ను అడ్డంపెట్టుకుని ఎన్నికలు వాయిదా వేయించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: