చంద్రబాబు హయాంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి స్వీకరించడం జరిగింది. ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావడం అయినా గాని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పదవిలో కొనసాగుతూనే ఉన్నారు. ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు త్వరలో జరగనున్న సందర్భంలో నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలు వాయిదా వేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు సీఎం జగన్. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉన్న కొద్దీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు. దీంతో ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోపక్క ఆరోగ్యశాఖని సంప్రదించకుండా ఇలాంటి ప్రకటన చేయటం దారుణమని సీఎం జగన్...నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం పై మండిపడ్డారు.

 

ఏదైనా అంటే తనకున్న విచక్షణా అధికారంతో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లు ఈ మధ్య ఒక కొత్త పదాన్ని సృష్టించారని..ఏ అధికారంతో గుంటూరు మరియు చిత్తూరు ఎస్పీలను బదిలీ చేయటానికి నోటీసులు ఇవ్వడం జరిగిందని సీరియస్ అయ్యారు. దీంతో నిమ్మగడ్డ రమేష్ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా వైయస్ జగన్ తీసుకున్నారట.

 

ముఖ్యంగా ఆర్థికంగా నష్టపోయి లోటు బడ్జెట్ కలిగిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తరుణంలో అనేక ఇబ్బందులకు గురి అవుతూ పరిపాలిస్తున్న తరుణంలో 14వ ఆర్థిక సంఘం నుండి రావలసిన 5 వేల కోట్లకు టోపీ పెట్టే విధంగా చంద్రబాబు డైరెక్షన్లో నిమ్మగడ్డ పనిచేస్తున్నారని సీఎం జగన్ బలంగా నమ్ముతున్నారు. దీంతో గతంలో ఏబీ వెంకటేశ్వరరావు కి పట్టిన గతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి పట్టే విధంగా న్యాయపరంగా సరికొత్త లీగల్ పాయింట్ తో జగన్ కేసు వేయటానికి ఆలోచిస్తున్నట్లు భారీ స్కెచ్ వేసినట్లు వైసీపీ పార్టీలో టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: