రాజకీయాలంటేనే ఓ పద్మవ్యూహం.. ఇందులో ఉన్న వారు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారో, ఎప్పుడు ఏమాట మారుస్తారో తెలియదు.. ఎవరు ఎవరికి శత్రువులు, మిత్రులు అవుతారో అర్ధం అవదు.. ఎన్ని వైరస్‌లు కలిసిన ఈ రాజకీయ వైరస్ ముందు అవేవి పనిచేయవు.. రాజకీయం అనేది మనుషులను రాక్షసులుగా మారుస్తుంది.. పదవి కాపాడుకోవడానికి అడ్దమైన పనులను కూడా చేయిస్తుంది..

 

 

ఇకపోతే తాజాగా బీజేపీ రాష్ట్ర అ‍ధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్‌.. కేసీయార్ మీద పలు వివాదస్పద వాఖ్యలు చేసాడు.. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్‌ పదవి రాగానే, కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు అన్నట్లు ప్రవర్తిస్తున్నాడని, అధికారం ఉందని ఏదిపడితే అది మాట్లాడకుండా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మండిపడ్డారు. ఇక తెలంగాణాలో ఏ ఎన్నికలు జరిగినా మీ పార్టీ చతికిల పడిందని, నేను పోటీ చేసి రెండు సార్లు గెలిచా. నువ్వు ఒక్కసారి గెలిచావు. బిడ్డా! ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అంటూ రెచ్చిపోయాడు..

 

 

ఇదే కాకుండా రానున్న రోజుల్లో మీ పార్టీకి గోరి కట్టడం ఖాయమని, ఇప్పటికే పునాదులు కూడా తీసారని ఎద్దేవా చేశాడు.. ఇక నిజ నిజాలు తెలుసుకుని మాట్లాడాలని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో అనవసర ఆరోపణలు మానుకుంటే మంచిదని పేర్కొన్నారు..

 

 

నీవల్ల అయ్యేమాటలు మాట్లాడు.. అనవసర డాంభికాలకు పోకు.. పదవి రాగానే ప్రగతి భవన్ కూల్చేస్తా అంటున్నావు, ఇలా పిచ్చి లేసి మాట్లాడుతున్నవా. లేక ప్రజలను రెచ్చగొట్టాలని మాట్లాడుతున్నావా... ఈ పోటుగాడు! గుండెల్లో నిద్రపోతా అంటున్నాడు. చూడండి.. ఇప్పటికే బీజేపీ కొన్ని ఏళ్ల తరబడి నిద్రపోయే ఉంది.. కాబట్టి మీరు కాస్త ట్రైనింగ్ తీసుకుని మాట్లాడితే మంచిది అని ఘాటుగానే విమర్శించారు జీవన్‌ రెడ్డి... 

మరింత సమాచారం తెలుసుకోండి: