ఈ రోజుల్లో చాలా మంది ఆడవారు సంతాన హీనులవుతున్నారు. అది ఎందువల్లనంటే అండాశయాల్లో ఉండే లోపాల వల్ల. మరి ఆ లోపాన్నితగ్గించి పిల్లలు కలిగే ఒక చిన్నచిట్కా ఏంటో తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్ధాలు ఒక ఐదారు కిస్మిస్లు ప్రతిరోజూ ఉదయం తిని కొద్దిగా వాటర్ తాగాలి. అంతే స్త్రీ అండాశయంలో ఎటువంటి లోపం ఉన్నా వెంటనే తొలగిపోతుంది. ఒకవేళ పురుషులు గనుక తిన్నారంటే వీర్యవృద్ధి పెరుగుతుంది. అలాగే కొంత మంది స్త్రీలకి గర్భంలో బుడగ లాంటిది ఉన్నా పిల్లలు పుట్టరు. దాని కోసం ఎక్కువగా మంచి నీళ్ళు తాగాలి. అలాగే వాకింగ్ చేసినా కూడా బుడగ పగిలి ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది.
ఇంకొంత మంది మహిళలు వివాహం కాకముందే లావుగా ఉంటారు అలా ఉండడం వల్ల గర్భాశయానికి కొవ్వు అడ్డుపడి పిల్లలు కలగడం కష్టం అవుతుంది. అందుకే కుదిరినంత వరకు మహిళలు వివాహం కాకముందు సన్నగా ఉండడం మంచిది. అంత లావుగా ఉండడం వల్ల చాలా నష్టాలు కలుగుతాయి. ఇక మగవారి విషయానికి వస్తే ఎక్కువగా ఆల్కహాల్ సేవించడం వల్ల కూడా వీర్యకణాలు చచ్చిపోతాయి. దాంతో సంతానం కలగడమనేది ఒక కలగా మిగిలిపోతుంది. వీటన్నిటినీ పట్టించుకోకుండా చాలా మంది అవి ఇవీ మందులు వాడుతుంటారు. ప్రధానంగా మనం మన శరీరం గురించి ఈ జాగ్రత్తలు గనుక తీసుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారు.
అలాగే కొంత మంది పెళ్ళైన కొత్తలోనే ఒక్కోసారి ఒక్కనెలకే నెల తప్పవచ్చు. అయితే ఇంత త్వరగా పిల్లలు ఎందుకు అని కొంత మంది వద్దనుకునేవారు ఏవో మందులు తీసుకువచ్చి వేసేసుకుంటారు. అలా మొదటిసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు అలాంటి మెడిసిన్స్ వేసుకోవడం వల్ల తిరిగి రెండోసారి గర్భం రావడం చాలా కష్టం అవుతుంది. ఎందువల్ల నంటే మొదటిసారి వేసుకున్న ఆ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఒక్కోసారి కలగవచ్చు.