తెలంగాణాలో చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇదేకాకుండా దాదాపుగా అన్ని సంస్దలకు సెలవులు మంజూరు చేశారు.. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బందులు పాటిస్తున్న టీచర్లు మాత్రం పాఠశాలలు, కాలేజీలకు వెళ్లవలసిందేనని, పెండింగ్ పనులను పూర్తి చేసుకోవాలని, అలాగే పరీక్షల విధులను నిర్వర్తించాలని, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ స్పష్టం చేశారు. సోమవారం ఇంటర్మీడియెట్, పాఠశాల విద్యాశాఖ జిల్లాల అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, అందుకు అనుగుణంగా డీఈవోలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఇక ఇంటర్ స్పాట్ వ్యాల్యుయేషన్ విధులు, టెన్త్ పరీక్ష విధులు పడిన వారు కచ్చితంగా వాటిని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, ప్రభుత్వం సెలవులు ప్రకటించినా వాటిని అమలు చేయకుండా తరగతులను నిర్వహించిన పాఠశాలలకు విద్యాశాఖ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఇవేకాకుండా ఇంజనీరింగ్ కాలేజీలు తరగతులను నిర్వహిస్తున్నట్లు విద్యా శాఖ దృష్టికి వచ్చింది. త్వరలోనే వాటిపైనా చర్యలు చేపట్టేందుకు సిద్ధం అవుతోంది.
అంతే కాకుండా నిబంధలను అతిక్రమిస్తున్న కాలేజీల లిస్టులో మంత్రి మల్లారెడ్డి బంధువు విద్యా సంస్థ కూడా ఉన్నట్లు సమాచారం. ఇక రాష్ట్రమంతా కరోనా భయంలో ఉండగా పదోతరగతి పరీక్షలు వచ్చాయి.. ఈ సమయంలో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను మాస్క్లతో అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కావునా ఈ పరీక్షలు రాసే విద్యార్థులు మాస్క్లు ధరించి హాజరు కావాలని అధికారులు వెల్లడించారు..
ఇదిలా ఉండగా కోవిడ్ హెల్త్ ఎమర్జెన్సీ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవులు ఇవ్వాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని కోరుతుంది.. ఇక జనసముహం ఎక్కువగా ఉంటే ఈ వ్యాధి మరింతగా ప్రబలే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ చర్యలను చేపడుతుంది.. కావున అందరు దీనికి సహకరించ వలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు..