కామంతో కళ్ళు మూసుకుపోతే... వావి వరుస ఏమీ తెలియదు. మనుషులు మృగాలైపోతున్నారు. పశువులకంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. తల్లి చెల్లి బిడ్డ ఇలా ఆడదయితే చాలు మరే బంధమైనా పర్వాలేదు. కామాంధులుగా మారి కళ్ళు మూసుకుపోయి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... బీహార్ రాష్ట్రంలో జమాల్పూర్కు చెందిన కేశవ్ కుమార్... పని కోసం... హైదరాబాద్ లో ఉన్న బాలానగర్లో బంధువుల వద్ద ఉంటున్నాడు.
బ్రతుకు తెరువు కోసం పని చేసుకోవడానికి వచ్చి బంధువుల ఇంట్లో ఉంటూ పని చూసుకున్నాడు. ఆరు నెలల కిందట నగరానికి వచ్చిన కేశవ్ హౌస్ కీపింగ్ పని చేసుకొని జీవిస్తున్నాడు. బంధవులు ఇంటి వద్ద ఒక గదిని అద్దెకు తీసుకొని కేశవ్ అక్కడ దగ్గరలో నివసిస్తున్నాడు. పని చేసి వచ్చాక తీరిక సమయాల్లో బంధువుల ఇంటికి వెళ్లేవాడు. ఆ ఇంట్లో ఉన్న ఓ 14 ఏళ్ల బాలికతో కేశవ్ చనువుగా ఉండేవాడు. అయితే వరుసకు కేశవ్ ఆపాపకి బాబాయ్ అవుతాడు. దాంతో కేశవ్ తీరును పెద్దగా ఇంట్లో వాళ్లెవరూ పట్టించుకునేవారు కాదు. బాబాయ్ అంటే తండ్రి తర్వాత తండ్రి స్థానం కాబట్టి ఓ తండ్రిలా కాపాడతాడు అనుకునేవారు తప్పించి కామాంధుడై కాటేస్తాడని వాళ్ళు గమనించలేకపోయారు.
నెమ్మదిగా బాలికను ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని ఆ అమాయకపు బాలికను నమ్మించి అమ్మాయిని తీసుకొని బెంగుళూరు వెళ్లిపోయాడు. అక్కడ ఓ గదిని అద్దెకు తీసుకొని ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకున్నాడు. గతేడాది డిసెంబర్ 3న తారీఖున బెంగుళూరు వెళ్లిన కేశవ్ బాలికను పెళ్లి చేసుకోకుండా అక్కడే ఉంచి అమ్మాయిని శారీరకంగా అనుభవిస్తూ ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తక్షణమే రంగంలోకి దిగిఆ బాలికను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. కేశవ్ మీద కేసును నమోదు చేసుకుని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.