కరోనా వైరస్ దెబ్బకి మళ్ళీ దేశీ స్టాక్ మార్కెట్ బేర్ మనింది. గత వరం రోజులులాగే ఈరోజు కూడా బెంచ్‌ మార్క్ సూచీలన్నీ కుప్పకూలాయి. ముఖ్యంగా ప్రపంచంలోని గ్లోబల్ మార్కెట్లన్నీ  పేకమేడలా కూలిపోవడం ఇందుకు ప్రధాన కారణం. బెంచ్‌ మార్క్ సూచీలు ఇంట్రాడేలో తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఒక సమయంలో 2% మేర లాభాల బాటపెట్టాయి. కాకపోతే ఈ లాభాలను సూచీలు ఎక్కువ సేపు నిలుపుకోలేకపోయాయి. ఇవి ఇలా ఉండగా నిఫ్టీ నేడు 9,000 మార్క్ కిందకు వెళ్ళింది. అలాగే సెన్సెక్స్ 811 పాయింట్ల నష్టంతో 30,579 వద్ద, నిఫ్టీ 230 పాయింట్ల నష్టంతో 8,967 వద్ద ముగిసాయి. దింతో మార్కెట్‌ కు ఇది మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది.

 

 

ఇక ఈరోజు మార్కెట్ ప్రధానాంశాలు చూస్తే నిఫ్టీ - 50 లో యస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, హీరో మోటొకార్ప్, కోల్ ఇండియా, హిందుస్తాన్ యూనిలివర్ షేర్లు లాభపడ్డాయి. ఇందులో చెప్పుకోతగ్గది యస్ బ్యాంక్ షేరు మాత్రమే. ఈ షేర్ ఏకంగా 59% లాభ పడింది. ఇక నష్టాల విషయానికి వస్తే జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, యూపీఎల్, ఇండస్ఇండ్ బయాంక్ షేర్లు నష్టపోయాయి. ఇందులో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఏకంగా 20% కుప్పకూలింది.

 

 

ఇంకా నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌ లన్నీ కాస్త మిశ్రమంగా క్లోజయ్యాయి. ఇందులో నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఫార్మాలు లాభపడగా మిగతా ఇండెక్స్‌ లన్నీ నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్‌ లు 4% నష్టపోయాయి.  దివి ఇలా ఉండగా అమెరికా డాలర్‌ తో పోలిస్తే ఇండియన్ రూపాయి కాస్త స్వల్ప లాభాల్లో ఉంది. కేవలం 3 పైసలు లాభంతో 74.24 వద్ద సాగుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కాస్త మిశ్రమంగా ఉన్నాయి. ఇందులో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.03%శాతం తగ్గి 30.05 డాలర్లకు చేరింది. అలాగే డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌ కు 1.76% పెరిగి 29.52 డాలర్లకు చేరింది. ఏది ఏమైనా గ్లోబల్ మార్కెట్లన్నీ కరోనా దెబ్బకి పేకమేడలా కూలిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: