తెలుగుదేశం పార్టీలో నిర్మొహమాటంగా ముక్కుసూటిగా అభిప్రాయాలను తెలియ చెప్పటంలో కేశినేని నాని ని మించిన వారు లేరు. ఎవరు తప్పు చేసినా ఎలాంటి తప్పు చేసినా పార్టీలో ఉన్నది ఉన్నట్టు బయట పెట్టేస్తారు. అంతెందుకు 2019 ఎన్నికల్లో ఎందుకు తెలుగుదేశం పార్టీ అంత దారుణంగా ఓడిపోయిన దాని గురించి చంద్రబాబు ని ఏకిపారేశారు. చంద్రబాబు చుట్టూ ఉన్న మనుషుల వల్ల తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయిందని విమర్శించారు. ఇదే తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ గాలి గట్టిగా విచినా గాని దాన్ని తట్టుకొని విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా కేశినేని నాని గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు కావస్తున్న ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి విజయవాడలో బలం ఎక్కువగా ఉండటంతో పార్టీ అధినేత చంద్రబాబు ఆ ప్రాంతంలో ఉన్న టిడిపి నాయకులకు విజయవాడ మేయర్ పీఠాన్ని ఎంపీ కేశినేని నాని రెండో కుమార్తె స్వాతికి కేటాయించిన‌ట్టు ప్రచారం జ‌రుగుతోంది.

 

 

దీంతో నిన్న మొన్నటి వ‌ర‌కు యాక్టివ్‌గా ఉన్న రెండు టీడీపీ వర్గాలు ఇప్పుడు సైలెంట్ అయిపోయాయి. వాస్తవానికి మేయ‌ర్ పీఠం కోసం తూర్పు ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ సతీమ‌ణి అనురాధ, అదేవిధంగా సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా భార్య సుజాత‌ను రంగంలోకి దింపి, మేయ‌ర్ పీఠంపై కూర్చోబెట్టుకోవాల‌ని నిర్ణయించుకున్నారు.

 

 

ఇటువంటి తరుణంలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఎంపీ కేశినేని నాని రెండు వర్గాలను సైలెంట్ అయిపోయేలా నోరు మూయించారు. దీంతో మొన్నటి వరకు సైలెంటుగా ఉన్న నాని తన కూతురు స్వాతిని మేయర్ రేసులో ఎలాగైనా గెలిపించే విధంగా పావులు కదుపుతున్నారు. దీంతో ఆ రెండు వర్గాలకు చెందిన టిడిపి నాయకులు అమ్మో కేశినేని నాని మామూలోడు కాదు సైలెంట్ గా వచ్చి ఎసరు పెట్టాడు అని లోలోపల చర్చించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: