నేటి సమాజంలో యువత వారి కామవాంఛ తీర్చుకోవడానికి ప్రేమ అనే యుద్ధాన్ని వల గా వేస్తున్నారు. వారు వేసిన గాలంలో ఎంతో మంది అమ్మాయిలు చిక్కుకొని వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. వారు చేసే మోసాలను అమ్మాయిలు గ్రహించలేక సర్వం కోల్పోతున్నారు. అలాగే మరో యువతీ కూడా నమ్మించి మోసపోయిన ఘటన తుమకూరు జిల్లాలోని శిరా తాలుకాలోని హులికుంట సమీపంలోని ఒక గ్రామంలో వెలుగు చూసింది.
ఆ బాలిక, భూతేష్ అనే అబ్బాయి టెన్త్ క్లాస్లో కలిసే చదివారు. అప్పటి నుంచి స్నేహంగా ఉన్న అతను బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి వచ్చి పెళ్ళి చేసుకుంటానని నమ్మించాడు. ఆమెను శారీరకంగా కలిశాడు. బాలికకు ఇటీవల కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు.
డాక్టర్ ఆమె గర్భవతి అని, కాన్పు నొప్పులు వస్తున్నాయని చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. ప్రస్తుతం బాలిక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. వారికి మెరుగైన వైద్యం ఆందించడానికి తుమకూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు భూతేష్ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.
ఓ విద్యార్థిని ద్వితీయ పీయూసీ చదువుతుంది. ఆమెను ఓ కుర్రవాడు ప్రేమ పేరుతో నమ్మించి దగ్గరయ్యాడు. బాలికను శారీరకంగా అనుభవించాడు. దీంతో బాలిక గర్భం దాల్చి ఆడ పిల్లకు జన్మనిచ్చింది. పసిప్రాయం బాలిక ఏం జరిగిందో కూడా తెలుసుకోలేక పోయింది.
ఈ సంఘటన బాధితురాలు అయిన విద్యార్థిని (17). నిందితుడైన యువకుడు భూతేష్ (18) పోలీసుల అదుపులో ఉన్నాడు. బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టనాయకనహళ్ళి పోలీసులు కుర్రవానిపై పోక్సో కేసు నమోదు చేశారు.
పసిప్రాయంలో వారు తెలిసి తెలియని వయస్సులో చేసే తప్పులతో వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలను జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు వీటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే కొంత వరకు ఈ ఘటనలను అరికట్టవచ్చు.