అక్రమ సంబంధాలు.. ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు స్త్రీలు... భారతీయ సంప్రదాయాలను, కట్టుబాట్లను తూచ తప్పకుండా పాటించేవారు. ఎప్పుడైతే పాశ్చాత్య సంస్కృతి మన దేశానికి పాకిందో స్త్రీలు కూడా తమ కట్టుబాటులను మార్చుకుంటూ వస్తున్నారు. ఆధునిక పోకడలకు పోతూ.. ప్రతి విషయంలో అప్ డేటెడ్ అవుతున్నారు. ఈ క్రమంలోనే అక్రమ సంబంధాలు పెట్టుకోవడంలోనూ ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. వాస్తవానికి వివాహేతర సంబంధం పెట్టుకుంటున్న మహిళల్లో ఎక్కువ మంది సంసార జీవితం వల్ల సంతోషంగా లేకపోవడం, భర్త తనను నిర్లక్ష్యం చేయడం, ఇంటి పనుల్లో భర్త పాలుపంచుకోకపోవడం వంటి కారణాల వల్ల అటువైపు చూస్తున్నారు.
ఇక తాజాగా వివాహేతర సంబంధంలో ఏర్పడిన గొడవలతో ఓ మహిళ ప్రియుడిని హత్య చేసింది. ఈ దారుణ ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తేని జిల్లాకు చెందిన దంపతులకు కేరళలో నివసిస్తున్నారు. వారి వద్ద కారు డ్రైవర్గా కేరళకి చెందిన రాజా అనే వ్యక్తి పని చేస్తున్నాడు. అయితే భర్తతో మూడేల్ల క్రితం విడిపోయిన సదరు మహిళ.. డ్రైవర్ రాజాతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త కూడా అడ్డు లేకపోకపోవడంతో వీరి అక్రమ సంబంధానికి చాలా రోజులు కొనసాగింది.
అయితే అనుకోకుండా డైవర్ రాజా.. సదరు మహిళ మధ్య గొడవలు స్టాట్ అయ్యాయి. దీంతో వారిద్దరి మధ్య దూరం కూడా పెరిగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే రాజాపై కోపం పెట్టుకున్న సదరు మహిళ కొన్ని రోజుల క్రితం అతడితో గొడవపడింది. దీంతో ప్రియుడిపై కక్షగట్టిన ఆమె చంపేయాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే సోమవారం మాట్లాడుకుందామని రాజాను ఓ నిర్మానుష్య ప్రాంతానికి పిలిచింది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం సదరు మహిళ వెంట తెచ్చుకున్న కారాన్ని అతడి కళ్లల్లో జల్లింది.
ఇక బాధతో విలవిల్లాడుతున్న రాజాను సదరు మహిళ విచక్షణా రహితంగా కత్తితో పొడిచి చంపింది. దీంతో అక్కడిక్కడే రాజా మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.