ప్రపంచాన్ని ఇప్పుడు కరోనా ముంచేస్తుంది.. ఎక్కడ చూసినా కరోనా వైరస్ గురించిన చర్చలే నడుస్తున్నాయి.   ఇప్పటికే ఈ వైరస్ వలన ప్రపంచంలో 8వేలమంది వరకు ప్రాణాలు కోల్పోయారు.  రోజు రోజుకు కరోనా ఉదృతం అవుతుండటంతో ప్రజలు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.   లక్షకు పైగా ఈ కరోనా వైరస్ బారిన పడ్డ విషయం తెలిసిందే.  భారత దేశంలో కరోనా మెల్ల మెల్లగా రాష్ట్రాల్లో విస్తురిస్తుంది.  కేరళా తర్వాత మహారాష్ట్రలో ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది.  అయితే కరోనాపై ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమైనా విషయం తెలిసిందే.  తాజా జనసేన అధ్యక్షులు, నటుడు పవన్ కళ్యాన్ కరోనాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోందని, అది ప్రవేశించిన రెండు వారాల తర్వాత విస్తృతి ఉంటుందని ఇతర దేశాల అనుభవాలు స్పష్టం చేస్తున్నాయని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.  తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాలు ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి.  అయితే, ఏపీలో స్కూల్స్  మూసివేయలేదు.  అన్ని యధావిధిగానే నడుస్తున్నాయి.  దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.  కరోనా వైరస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. ఏపీ ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం పంతాలు, పట్టింపులకు పోవద్దని సూచించారు.

 

కేంద్ర ప్రభుత్వం సూచించినట్టుగా వెంటనే విద్యా సంస్థల బంద్, ఇతర చర్యలను అమల్లోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ కట్టడి కోసం తీసుకునే చర్యలను సామాజిక బాధ్యతగా గుర్తించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆఫీసులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని.. వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో స్క్రీనింగ్ సెంటర్లు, ఐసోలేషన్ వార్డులు, ల్యాబ్ లను పెంచాలన్నారు.  మన రాష్ట్రంలో లేదు.. వైరస్ పోతుంది అనుకునే పరిస్థితి లేదు. కేంద్ర మార్గదర్శకాలను వెంటనే అమలు చేయాలి అని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: