ప్రపంచ రాజకీయాలు మరియు వ్యాపారాలు మొత్తం అన్ని కరోనా వైరస్ చుట్టూ తిరుగుతున్నాయి. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇటలీ లో అయితే చాలా మందికి ఈ వైరస్ వల్ల మరణించడం . భారతదేశంలో కూడా ఈ వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ జాగ్రత్తలు మరియు సూచనలు రాష్ట్ర ప్రభుత్వాలకు . చాలాచోట్ల కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా వైరస్ ల్యాబ్స్ అందుబాటులోకి తీసుకువచ్చే ప్రజల ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేయడం స్టార్ట్ చేసింది. ఇదే క్రమంలో పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రజలకు అనేక రకాల జాగ్రత్తలు సూచనలు ఇస్తూ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

 

దీనిలో భాగంగా స్కూలు మరియు షాపింగ్ మాల్స్ అదేవిధంగా కాలేజీలు అన్ని క్లోజ్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో సీఎం వైఎస్ జగన్ పై బుద్ధ వెంకన్న అదిరిపోయే లాజిక్ క్వశ్చన్ లాంటి పోస్ట్ సోషల్ మీడియాలో వేశారు. ఇటీవల ముఖ్యమంత్రి ఈ వైరస్ గురించి మాట్లాడుతూ 'పారాసిటిమల్ వేస్తే కరోనా పారిపోతుందని, బ్లీచింగ్ పౌడర్ చల్లితే కరోనా చచ్చిపోతుందని వైఎస్ జగన్‌ గారు సెలవిచ్చారు. అసలు కరోనా పెద్ద విషయమే కాదు అన్న జగన్ గారు ఆయన ఇద్దరు కుమార్తెలను లండన్ నుండి ఎందుకు వెనక్కి పిలిపించారు?' అని ప్రశ్నించారు.'అంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయినా పర్వాలేదు.

 

రాష్ట్రంలో ఉన్న పిల్లలు కరోనా బారిన పడినా ఫర్వాలేదు. జగన్ గారి కుటుంబం మాత్రం హాయిగా తాడేపల్లి కోటలో సురక్షితంగా ఉండాలి. జగరోనా కి ఇంత స్వార్థమా?' అని నిలదీశారు. దీంతో ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోపక్క ఈ పోస్ట్ కి వైసీపీ పార్టీ కార్యకర్తలు బుద్ధా వెంకన్న బుద్దా వెంకన్న కాదు నీ పేరు బుద్ధి లేదు వెంకన్న అని పెట్టుకోవాల్సింది...లండన్ లో సెలవులు ఇస్తే ఇంటికి రాకుండా అక్కడే ఎలా ఉంటారు  అంటూ కౌంటర్లు వేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: