ఈ రోజు తెలంగాణలో పదవ తరగతి ఎగ్జామ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ తో విద్యార్థులుకు తగు జాగ్రత్తలు చెప్పి పరీక్ష హాల్ కి పంపుతున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు. ఈ మద్య ప్రభుత్వ అధికారులు కొంత మంది చేస్తున్న చిత్రమైన పనుల వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఓటర్ లీస్ట్, హాట్ టికెల్ విషయాల్లో ఒకరి బొమ్మలకు బదులు వేరే వారి బొమ్మలు పెట్టి ప్రింట్ తీయడం చూస్తున్నాం. ఆ మద్య ఓటరు లీస్ట్ లో తన బొమ్మకు బదులు ఏకంగా కుక్క బొమ్మ ప్రింట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ పదో తరగతి విద్యార్థికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. స్టూడెంట్ పేరు హిదయత్ పబ్జీ, తండ్రి పేరు తాహెర్ పబ్జీ లైట్, తల్లిపేరు రేష్మా ఫాతిమా… స్టూడెంట్ ఫోటో ప్లేస్ లో పబ్జీ బొమ్మ… ఇది బుధవారం టెన్త్ హాల్టికెట్లో దర్శనమివ్వడంతో ఆశ్చర్యపోారు.
ఓ ప్రైవేటు స్కూల్ మేనేజ్మెంట్ తప్పిదం, అధికారుల నిర్లక్ష్యంతో లేని విద్యార్థి పేరుతో ఈ హాల్టికెట్ బయటకొచ్చింది. హైదరాబాద్జిల్లాలోని షాలిబండలోని‘ఎస్’ ది స్కూల్ లో 43 మంది విద్యార్థులున్నారు. కానీ మేనేజ్మెంట్ 44 మంది ఉన్నట్టు అధికారులకు వివరాలు పంపించింది. అయితే యాజమాన్యం పంపిన వివరాల ప్రకారం ఈ నామినల్ రోల్స్ లో ఏమైనా తప్పులున్నాయా? అని అధికారులు తిరిగి మేనేజ్మెంట్ను ప్రశ్నించినా అన్ని సక్రమంగానే ఉన్నాయని సమాధానం ఇచ్చారంటూ అధికారులు చెప్తున్నారు.
అయితే హాల్ టికెట్ లో మాత్రం హాల్టికెట్(2022114399)ను స్కూల్ ప్రతినిధి సోషల్ మీడియాలో పెట్టినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు విచారణ చేపట్టారు. అసలు హిదయాత్ పేరుతో స్టూడెంట్ లేరని గుర్తించారు. ‘ఎస్’ ది స్కూల్ మేనేజ్మెంట్పై చర్యలు తీసుకోనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి. అయితే తప్పుగా వచ్చిన హాల్ టికెట్ ను స్వాధీనం చేసుకున్నామని... వెబ్సైట్నుంచి హాల్టికెట్ను తొలగించామన్నారు.