వైసీపీ కీలకనేత పార్లమెంటరీ సభ్యుడు అయిన విజయ్ సాయి రెడ్డి ఎప్పుడూ ప్రతిపక్షాలపై ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. జగన్ సర్కార్ పై ప్రతిపక్ష టిడిపి పార్టీ చేస్తున్న విమర్శలను తిప్పి కొడుతూ... తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. అంతేకాకుండా జగన్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గొప్పతనాన్ని గురించి కూడా ట్విట్టర్ వేదికగా వివరిస్తూ ఉంటారు వైసీపీ కీలకనేత పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి. ఇక తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై పరోక్షంగా విమర్శలు చేస్తూనే జగన్ సర్కార్ పై ప్రశంసలు కురిపించారు. 

 


 సిమెంట్ ధరలు తగ్గేలా చేయడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  గొప్పతనం అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా అభివర్ణించారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది అంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం అంటూ చంద్రబాబును ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు విజయసాయి రెడ్డి . శిఖండిని అడ్డం పెట్టుకొని నువ్వు చేసే యుద్ధం... కేవలం నీకు మద్దతు పలికే మీడియా సంస్థలకు  మాత్రమే ఉత్సాహపరుస్తుంది అని వ్యాఖ్యానించిన విజయసాయిరెడ్డి... మీకు ఎదురయ్యే పరాభవాన్ని మాత్రం నిలువరించలేవు  అంటూ వ్యాఖ్యానించారు. 

 

 ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో  ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్న ఎంతోమంది నిరుపేద ప్రజలకు ఊరట కలిగించింది అంటూ ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక పేద ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  సర్కార్ పంపిణీ చేసే ఇళ్ల స్థలాల్లో  నిరుపేదలు ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో... సిమెంటు ధరలను భారీగా తగ్గించేలా సిమెంట్  కంపెనీలను ఒప్పించడం కేవలం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి గొప్ప విజయం అంటూ అభివర్ణించారు వైసీపీ కీలకనేత పార్లమెంటరీ సభ్యుడు విజయసాయిరెడ్డి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎన్నికల కోడ్ ఎత్తివేయాలంటూ ఆదేశించడంతో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: