రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం తంగేడు పల్లి గ్రామ సమీపంలో నగ్నంగా గుర్తుతెలియని మహిళ శవం లభించడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గుర్తు తెలియని మృతదేహం ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసును ఛేదించడం పోలీసులకు సవాల్ గా మారిపోయింది. అయితే ఈ కేసు ఛేదనలో  భాగంగా పోలీసులకు దొరికిన ఒక చిన్న క్లూ... ప్రస్తుతం విచారణలో కీలకంగా మారిపోయింది. మృతురాలు గుజరాత్ కు  చెందిన మహిళ గా గుర్తించారు పోలీసులు. గత కొద్ది రోజుల క్రితం గుజరాత్ లో ఓ అదృశ్యం కేసు నమోదయింది. గుజరాత్ లో అదృశ్యమైన మహిళ ఫోటోని సైబరాబాద్ పోలీసులకు పంపించారు గుజరాత్ పోలీసులు.

 

 

 ఈ క్రమంలోనే ఆ మహిళ గుజరాత్  రాష్ట్రానికి చెందినట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గుజరాత్ చేరుకున్న సైబరాబాద్ పోలీసులు గుజరాత్లోని సదరు మహిళ బంధువులను చేవెళ్లకు  తీసుకురానున్నట్లు తెలుస్తోంది.  అయితే ఈ హత్య వెనుక అసలు కారణం వివాహేతర సంబంధం అని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నట్లు సమాచారం. అయితే వివస్త్రగా పడిఉన్న ఆ మహిళ శవం వద్ద దొరికిన క్లూ ఆధారంగా ప్రస్తుతం కేసు విచారణ చేపడుతున్నారు పోలీసులు. 

 

 

ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలు   ఈ మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. సదరు మహిళ ధరించిన ఆభరణాలు... వజ్రాలతో పొదిగిన ఎంతో విలువైనవి అంటూ అంచనా వేశారు పోలీసులు. ఆ మహిళ మృతదేహం పై ఉన్న ఆభరణాల విలువ దాదాపు 15 లక్షల వరకు ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా సదరు మహిళ కాళ్లు చేతులకు కమిలిపోయిన గాయాలు ఉన్నాయని... ఈ క్రమంలోనే ఆ మహిళను కట్టేసి హింసించి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక సదరు మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత సంచలన నిజాలు బయటపడ్డాయి. పోస్టుమార్టంలో ఆ మహిళకు ఉరివేసి... తర్వాత బండరాయితో మోది చంపేశారు అంటూ వెల్లడయింది. ఇక మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: