దేశవ్యాప్తంగా ఎనిమిది సంవత్సరాలపాటు ప్రతి ఒక్కరి నోళ్లలో నాన‌డంతో పాటు మీడియాలో ప్రధానంగా నిలిచిన నిర్భయ కేసుకు ఎట్టకేలకు శుక్రవారం ఉదయం తో తెరపడింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నలుగురు దోషులకు ఒకేసారి ఉరిశిక్ష అమలు చేశారు. అయితే ఈ సంఘటన జరిగిన 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి 10 గంటలకు ఏం ? జరిగింది అన్నది పరిశీలిస్తే ఆ రోజు జరిగిన దారుణ సంఘటన ప్రతి ఒక్కరిని తీవ్రంగా క‌లిచి వేసేలా ఉందని అనాల్సిందే. ఆ రోజు రాత్రి 10 గంటలకు వైద్య విద్యార్థిని అయిన తన మిత్రుడితో కలిసి బస్సు ఎక్కింది కొద్దిసేపటికి బస్సు డ్రైవర్ దారి మళ్లించాడు నిందితులు బస్సు తలుపులు మూసేశారు.



దీంతో అనుమానం వచ్చిన వైద్య విద్యార్థిని మిత్రుడు వారిని ప్రశ్నించగా వారు అతడి తలపై ఇనుప రాడ్తో కొట్టడంతో అతడు స్పృహ తప్పి పడిపోయాడు. ఆ తర్వాత బస్సు ను ఓ మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. కదులుతున్న బస్సులోనే ఈ దుర్మార్గులు అత్యాచార‌ చర్యకు పాల్పడ్డారు. ఆమె అరిచి.. నోటితో కొరికి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే ఆమెను రాడ్‌తో విపరీతంగా కొట్టిన వారు ఆమెను కొట్టి ఆమె యోనిలోకి బలంగా చొప్పించారు.



ఇనుప రాడ్‌ను ఆమె మర్మాంగ అవయవాలలో కి గట్టిగా పెట్టి.. లోప‌ల‌కు గుచ్చుతూ పైశాచిక ఆనందం పొందారు. అనంత‌రం వాళ్లు బస్సులు నడుపుతూ ఒకరి తర్వాత ఒకరు నెత్తురోడుతున్న ఆమెపై అత్యాచారం చేశారు. దాదాపు గంటకు పైగా ఆమెను చిత్రహింసలు పెట్టారు. తర్వాత ఆమెను వివస్త్రను చేసి రోడ్డుపైకి తోసేశారు. ఆమె మిత్రుని కూడా కిందకు తోసేశారు. ఆ ఇనుప రాడ్‌ తుప్పుపట్టి ఎల్ ఆకారంలో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.



రాత్రి 11 గంటలకు అటువైపు వెళుతున్న కొందరు గ‌స్తీ సిబ్బంది ఆమెను చూసి ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పరిశీలనలో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు వెలువడ్డాయి. ఆమె పొట్ట‌లో ఉండాల్సిన పేగుల్లో కేవలం 5 శాతం మాత్రమే ఉన్నట్టు తేలింది. ఈ మృగాళ్లు ఆమె యోని లోపల ఇనుప‌రాడ్‌ పెట్టి బయటకు లాగడంతో పేగులు బయటకు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అలా నాడు ఆ ఘోర‌మైన సంఘ‌ట‌న జరిగింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: