ఇప్పుడు ప్రపంచం అంత బయ భాంత్రుల్లో దడ దడ లాడుతుంది. ఎక్కడో చైనా నుంచి వచ్చినా వైరస్ దేశం మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తున్నది.ఈ వైరస్ సోకడానికి కారణం మానవ తప్పిదమే కారణం అని నిపుణులు సూచిస్తున్నారు. వివిధ రకాల వైరస్ల వల్ల సంక్రమిస్తోన్న వ్యాధులను ఆంగ్లంలో ‘జూనాటిక్ డిసీసెస్’ లేదా ‘జూనోసెస్’ అని అంటారు. అంటే జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులని అర్థం. మానవులకు సంక్రమించే వ్యాధుల్లో 75 శాతం అంటువ్యాధులు కాగా, వాటిలో 60 శాతం జంతువుల నుంచి సంక్రమిస్తున్నవే. నేడు ప్రపంచ దేశాల ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న కోవిడ్ వైరస్ కూడా ఆ కోవకు చెందినదే., గబ్బిలాలు పాములు వాళ్ళ ఈ వైరస్ మానవులకి సోకింది, కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన సార్స్ (సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) పునుగు పిల్లుల నుంచి మానవులకి వచ్చింది. అలాగే మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్), ఒంటెల వల్ల వచ్చింది. అలాగే ఎబోలా, బర్డ్ ఫ్లూలు కోళ్ల వల్ల మానవులకి సంక్రమించాయి.
వ్యవసాయ విస్తరణ లేదా పట్టణీకరణ లేదా మరే ఇతర కారణాల వల్ల జంతువులు, ఇతర వన్య ప్రాణులు జీవించే అడువులను నరికి వేయడం వల్ల జంతువుల ఆరోగ్యం క్షీణించి వైరస్ల బారిన పడుతున్నాయి.మానవులు విచక్షణ రహితంగా అడవులని నరికి కొట్టేస్తున్నారు. దీనితో జంతువులకి నివసించే ప్రదేశం లేక అల్లాడుతున్నాయి. కాలుష్యం కూడా బాగా పెరిగిపోయింది. బలిష్టంగా రూపాంతరం చెంతుతోన్న పలు రకాల వైరస్లు వాటి నుంచి మనుషులకు సోకుతున్నాయి. అడవులను నరికివేయడం వల్ల పర్యావరణ పరిస్థితులు దెబ్బతినడంతోపాటు ఇలాంటి అనర్థాలు సంభవిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం విభాగం 2016లోనే ఓ నివేదికలో హెచ్చరించింది.ఒక్క 2018లోనే చెట్లు నరికివేయడం వల్ల, కార్చిచ్చుల వల్ల 1.20 కోట్ల హెక్టార్ల అడవులు నశించాయని, బ్రెజిల్, ఇండోనేసియా, మలేసియా దేశాల్లో ఎక్కువ అడవులు నశించాయని ‘గ్లోబల్ వారెస్ట్ వాచ్’ ఓ నివేదికలో వెల్లడించింది.
అతి తక్కువ స్థలంలో జన సాంద్రత ఎక్కువగా ఉండడం, సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఒకరికి సోకిన వైరస్ ఇతరులకు వేగంగా వ్యాపిస్తోందని ఆ నివేదికలో ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.వైద్య సదుపాయం కూడా ఎప్పటికి కొన్ని కొన్ని ప్రాంతాలలో సరిగా లేదు. దీనివల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాధి సంక్రమణ అధికం అవుతుంది. పర్యావరణ ఆరోగ్యం సరిగ్గా ఉన్నప్పుడే ప్రపంచ మానవాళి మనుగడ బాగుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఆహార, వ్యవసాయ సంస్థ పిలుపునివ్వగా, ‘జంతువులు, అడవుల ఆరోగ్యంపైనే మానవులు ఆరోగ్యం ఆధారపడి ఉంది’ అని ‘ది సెంటర్ ఫర్ పీపుల్ అండ్ ఫారెస్ట్స్ ఇన్ బ్యాంగ్కాగ్’ ఎగ్సిక్యూటివ్ డైరెక్టర్ డేవిడ్ గ్యాంగ్ వ్యాఖ్యానించారు. ఏదిఏమైనా వైరస్ల విజృంభణకు మానవ తప్పిదనమని స్పష్టం అవుతోంది.నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, అడవుల కొట్టివేత అన్ని ఎక్కువ అయిపోయాయి. దీనితో అంటూ వ్యాధులు ప్రబలడం ఎక్కువ అయిపోయాయి. ఇప్పటికన్నా మనం చేసే తప్పులు తెలుసుకుని పర్యావరణాన్ని కాపాడదాం. పచ్చదనమే -పర్యావరణం అని అందరికి చాటుదాం.