ప్రపంచంలో కరోనా వైరస్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. ఇప్పటికే 177 దేశాలకు విస్తరించింది. రోజు రోజు కీ దీని ప్రభావం మరింత పెరిగిపోతుంది. కాకపోతే కరోనా మాత్రం చైనాల కంట్రోల్ అయ్యిందని అంటున్నారు. లోకల్ గా నిన్న ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అంటున్నారు.  అయితే ఈ కరోనా ఎఫెక్ట్ ఇప్పుడు ఇటలీలో ఎక్కుగా చూపిస్తుంది. భారత్ లో ఇప్పటికే 200 వరకు కరోనా కేసులు నమోదు అయ్యాయని అంటున్నారు.  ఇప్పటి వరకు ఐదుగురు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా ఎఫెక్ట మొదల కేరళలో ప్రారంభం అయ్యింది.. ఇప్పుడు మహారాష్ట్రలో తీవ్ర ప్రభావం చూపిస్తుంది.  ఇప్పటివరకూ నమోదైన మృతుల సంఖ్య 9,800 దాటిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.  అయితే కేరళాలో కరోనా ప్రభావంతో మందు భాబుల్లో భలే మార్పు వచ్చింది. 


అలా అని మందు మానేశారనుకుంటే పొరపాటు.  కేరళ మందుబాబులు సామాజిక దూరం పాటిస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసర పనులు అయితేనే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని.. కరోనాను అరికట్టే బాధ్యత ప్రతి బారత పౌరుడికి ఉందని విజ్ఞప్తి చేస్తున్నారు.  అయితే కేరళాలలో ఈ కరోనా ప్రభావం వల్ల మందు బాబులు సామాజిక దూరం పాటిస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు. రంతా ఓ పద్ధతి ప్రకారం, క్యూలో ఒకరిని ఒకరు తాకకుండా నిలబడి, తమకు కావాల్సిన మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇక ఈ వీడియోను చూసిన వారంతా, ప్రజలకు ఈ మందుబాబులు ఆదర్శనమని సెటైర్ మీద సెటైర్లు వేస్తున్నారు.  


మద్యం కోసం వచ్చిన వీరికి దుఖానం యజమాని కనీసం మనుషుల మద్య ఓ మీటరు దూరం మెయింటేన్ చేయాలని చెప్పడంతో మందు బాబులు ఇదే పద్దతి పాటించినట్లు కనిపిస్తుంది. అక్కడ ముగ్గుతో గీతలు గీయగా, అందరూ క్రమశిక్షణతో తమకు కేటాయించిన వరుసలో కదులుతూ ఉన్న వీడియోను చూసి నవ్వుకుంటున్నారు. ఇక కొందరు మాస్కులతో,  ఇందులో ఓ వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని మరీ క్యూ లైన్లో నిల్చున్నాడు.. తాజాగా ఈ వీడియో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: