తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం చాలా తీవ్ర రూపం దాల్చుతుంది. ఇప్పటికే తెలంగాణలో 16 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్ లో మూడు కేసులు నమోదయ్యాయి. అనుమానితుల సంఖ్య అయితే రోజురోజుకి మితిమీరిపోతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింతగా అప్రమత్తం అయింది. మొన్నటి వరకు ఎన్నికల హడావుడి లో కరోనా విషయాన్ని కొద్దిగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడైనా కరోనా లక్షణాలు కనిపిస్తే చాలు వెంటనే చర్యలు చేపడుతున్నారు. ఎన్నో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు అడుగులు వేస్తున్నారు.

 

ఇప్పుడు కర్నూలు జిల్లాలో జరిగిన ఒక సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కరోనా లక్షణాలు కనిపించిన ప్రయాణీకులు ఉన్న ఒక బస్సును ఏకంగా ఆస్పత్రికి తరలించారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మీదుగా ధర్మారం వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు లో కొందరికి కరోనా లక్షణాలు ఉన్నాయని పలువురు అనుమానించారు. దీంతో వెల్దుర్తి వెళ్తున్న బస్సును ఆపివేసి ప్రయాణికులు ఆటోలో బస్సు తో 13 మందిని సహా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

అనుమానితులైన 11 మంది తో సహా అందులో ప్రయాణించిన అందరినీ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వైరస్ లక్షణాలు కనిపించడంతో ప్రయాణికులు డ్రైవర్ కండక్టర్ సహా ఆసుపత్రికి అందరూ వెళ్లారు అని తెలుస్తోంది. అయితే కరోనా ప్రభావంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఒక స్పష్టతను ఇచ్చింది. కరోనా వైరస్ బారిన పడిన ప్రకాశం, నెల్లూరుకు చెందిన వ్యక్తులు కోలుకుంటున్నారని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ప్రకటించారు. కరోనాపై ఎలాంటి మరణం లేదని స్పష్టం చేశారు. ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జనతా కర్ఫ్యూకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: