ప్రేమించి వారినే అంద‌రూ పెళ్లి చేసుకుంటున్నారా..? అంటే లేద‌నే చెప్పాలి. అయితే పెళ్లికి ముందు ఎవ‌రిని ప్రేమించినా.. పెళ్లి త‌ర్వాత మాత్రం భ‌ర్త‌నే ప్రేమించాల‌ని చెబుతుంటారు. లేకుంటే జీవితాలు అత‌లాకుత‌లం అవుతుంటాయి. అయితే పెళ్లైనా.. ప్రేయుడిని మ‌రిచిపోలేక‌.. ఆత‌డిపై మోజు చంపుకోలేక‌ ఓ మ‌హిళ ఏకంగా భ‌ర్తనే హ‌త‌మార్చింది. ఈ దార‌ణ ఘ‌న‌ట అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..  పట్టణంలోని ఆంజనేయస్వామి మాన్యానికి చెందిన శేఖర్‌(40) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. 

 

యాడికి మండలం కత్తిమానుపల్లికి చెందిన బలరాముడు నాలుగు సంవత్సరాల కిందట తాడిపత్రికి వచ్చి ఆంజనేయస్వామి మాన్యంలో నివాసం ఉంటున్నాడు. శేఖర్‌కు వరుసకు బలరాముడు సోదరుడు కావడంతో అతడి ఆటోను కూడా నడుపుతూ ఉండేవాడు. అయితే శేఖ‌ర్‌కు నాగ‌మ్మ అనే మ‌హిళ‌తో వివాహం జ‌రిగింది. శేఖర్ ను పెళ్లి చేసుకున్నప్పటికీ నాగమ్మకు మాత్రం వరసకు బావ అయిన బలరాముడు అంటేనే ఇష్టం. అందుకే అతడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలియకుండా చాన్నాళ్లు ఈ వ్యవహారం సాగింది.

 

ఈ విష‌యం కొద్ది రోజుల క్రితం బ‌య‌ట ప‌డ‌డంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవి. కొన్నిసార్లు శేఖర్‌ మద్యం సేవించి భార్యను విచక్షణారహితంగా కొట్టేవాడు. దీంతో త‌న అక్ర‌మ‌సంబంధానికి ఎలాగైనా భర్తను అడ్డు తొలిగించుకోవాలని చూసింది నాగమ్మ.  ఈక్రమంలో శేఖర్‌ను హత్య చేసేందుకు నాగ‌మ్మ‌, బ‌ల‌రాముడు పథకం రచించారు. ఈ క్ర‌మంలోనే  ఓబులేసుకోన కొండకు వెళదామని చెప్పి ఉదయాన్నే భర్తను సిద్ధంచేసి.. వేకుమజామున బైక్‌పై ఇద్దరూ బయల్దేరారు.

 

మండలంలోని ఆవులతిప్పాయపల్లి వద్దకు వెళ్లగానే భర్తను ఓ చోట బండి ఆపమంది నాగమ్మ. అదే టైమ్ కు వాళ్లను మరో బైక్ లో ఫాలో అవుతూ వ‌చ్చాడు బలరాముడు. ఇక ముందుగా అనుకున్న ప్లాన్ ప్ర‌కారం త‌న వెంట తెచ్చుకున్న క్రికెట్‌ బ్యాట్‌తో బ‌ల‌రాముడు శేఖర్‌ తలపై బాదాడు. దీంతో అక్కడికక్కడే చనిపోయాడు. అలా ఇద్దరూ కలిసి శేఖర్ ను చంపి, దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. హ‌త్య చేసి యాక్సిడెంట్‌గా క్రియేట్ న‌మ్మ‌డానికి పోలీసులు సామాన్యులు కాదు క‌దా. దీంతో త‌మ స్టైల్‌లో నాగ‌మ్మ విచారించ‌గా.. అస‌లు నిజంగా బ‌య‌ట ప‌డింది. ఇక ఇద్ద‌రు నిందితుల‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: