కరోనా వైరస్ భారత్ లో అడుగు పెట్టిన నుండి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ వ్యాధి దేశంలో ఎక్కువ మందికి వ్యాపించక ముందే దీనిని నియంత్రించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

 

కరోనా వైరస్‌ను అరికట్టడం కోసం ప్రధాని మోదీ ‘జనతా కర్ఫ్యూ’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలకు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

 

ప్రజల కోసం ప్రజల ద్వారా ప్రజలు జనతా కర్ఫ్యూను పాటించాలని ఆయన కోరారు. కరోనాపై పోరాటంలో ప్రధాని మోదీ సూచనలను తాను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రధాని మాట పాటిద్దాం - కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం అని ఆయన పిలుపునిచ్చారు.

 

జాతిని ఉద్దేశించి మోదీ చేసిన సూచనలను జన సైనికులే కాక తెలుగు వారందరూ పాటించాలని జనసేన అధినేత పవన్ విజ్ఞప్తి చేశారు. ప్రధాని చెప్పినట్టుగా ఈ నెల 22న ఆదివారం నాడు జనతా కర్ఫ్యూగా పాటిద్దామని పిలుపునిచ్చారు. ఆ రోజు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇళ్లకే పరిమితమవుదామన్నారు.

 

‘ప్రమాదమని తెలిసినప్పటికీ కరోనా మహమ్మారి నిర్మూలనకు క్షేత్రస్థాయిలో పని చేస్తున్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్‌, వైద్య ఆరోగ్య సిబ్బంది, మీడియా వారు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు... ఇలా ప్రతి ఒక్కరికీ మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుతూ మన ప్రధాన మంత్రి చెప్పినట్లు ఆదివారం సాయంత్రం అయిదు గంటలకు మన ఇంటి బాల్కనీలలో నిలబడి కరతాళ ధ్వనులు ద్వారా వారికి మన సంఘీభావం తెలుపుదాం’ అని పవన్ పిలుపునిచ్చారు.మోదీ పిలుపునకు దేశమంతా స్పదించాలని కోరారు. కర్ఫ్యులో మన సత్తా చాటుకుందామన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: