ఒక వైపు కరోనా వచ్చి దేశం మొత్తం గగ్గోలు పెడుతుంటే.. కొందరైతే ప్రభుత్వం ఇచ్చిన సూచనలను పాటించకుండా కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నారు.. ముఖ్యంగా ఇటలీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అక్కడి ప్రజలు ఆ దేశ పతనానికి కారకులైనారు.. ఇదంతా మనిషిలో భయం అనేది లేకపోవడం వల్ల.. ఇక ప్రస్తుతం ఈ కరోనా వల్ల విదేశాల్లో ముద్దు పెట్టుకోవాలన్నా జంకుతున్నారు.. కనీసం ఒకరికొకరు ప్రేమగా మాట్లాడుకోలేని పరిస్దితి..

 

 

ఇప్పటికే కరోనా పుట్టిన చైనా కంటే ఇటలీ ప్రమాదకరంగా మారిన సంగతి తెలిసిందే. మరణాల విషయంలో కూడా చైనా సంఖ్యను ఇటలీ తాజాగా దాటేసింది. దీంతో ఇటలీ ప్రభుత్వం ‘లాక్‌డౌన్’ ప్రకటించింది.. ఇంత జరుగుతున్నా, ఆ దేశం మొత్తం నాశనమవుతున్న ప్రజలు దాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. నిబంధనలు సైతం ఉల్లంఘించి బరితెగిస్తున్నారు. చివరికి కార్లలో కూడా ప్రజలు పక్క పక్కన కుర్చో కూడదని, ముందు సీట్లో ఒకరు, వెనుక సీట్లో ఒకరు మాత్రమే కుర్చొని ప్రయాణించాలనే రూల్ పెట్టిన గానీ, చెప్పేది మాకు కాదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.. దీనికి నిదర్శనమే ఇటలీలోని ఈ జంట..

 

 

అక్కడి ప్రభుత్వ నిబంధనలు ఉల్లఘించి ఇద్దరు ఒకే సీట్లో కుర్చోవడమే కాదు, ఏకంగా సెక్సులోనే పాల్గొన్నారు. చివరికి పోలీసులకు దొరికి చిక్కుల్లో పడ్డారు... ఇదే కాకుండా ఇటీవల కొందరు భక్తులు ప్రార్థన మందిరాల్లో ఆలయ గోడలను తలుపులను నాకుతూ వింతగా ప్రవర్తించారు. ఇలాంటి పిచ్చి చర్యలతో ప్రవర్తిస్తున్న ఇటలీ ప్రజలు ఇంతటితో ఆగడం లేదు.. ఇకపోతే ఒక జంట తమ వయస్సును మరచి, అక్కడ ఉన్న పరిస్దితులను మరచి శృంగారాన్ని ఆస్వాధిస్తున్నారు..

 

 

అదేంటో చూస్తే 23 ఏళ్ల ఈజిప్టు యువకుడు, 43 ఏళ్ల తునీషియా మహిళ.. మిలాన్ శివారులోని రోడ్డుపక్కన కారులో శృంగారం చేసుకుంటూ పోలీసుల కంట పడ్డారు. దీంతో పోలీసులు ‘కరోనా వైరస్ దిగ్బంధం నియమం’ ఉల్లంఘన కింద వారిని అరెస్టు చేశారు. అయితే, వీరిపై కారులో శృంగారం చేసుకుంటున్న కేసు పెట్టక, నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు ఒకే సీట్లో కలిసి ఉన్నారనే కారణంతోనే వారిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం.. చూసారా ఇలాంటి పరిస్దితుల్లో అలా చేయడం నిజంగా దురదృష్టకరం.. ఇలాంటి వారు పట్టణానికి ఒక్కరుంటే చాలు, ఆ నగరమే శ్మశానం అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: