పెద్ద పెద్ద నగరాల్లో రాత్రిపూట వ్యభిచారం ఉగ్రరూపం దాల్చడంతో కొన్ని నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి..ఇక్కడ పేరుకు క్లినిక్ లోపల జరిగేది మాత్రం వ్యభిచారం నిర్వహిస్తున్న  ముఠాను పోలీసులు అనుమానిస్తున్నారు.. ఈమేరకు విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయాలు తెలుసుకొని విస్తుపోయారు.. ఈ వ్యభిచారం నిర్వహిస్తున్న వారిలో రాజకీయ నాయకులు ఉండటంతో షాక్ అయ్యారు...

 

 

 

 

పాట్నాలో కొనసాగుతున్న వ్యభిచార దందాను పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని బుగా కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధి కిడ్వైపురిలోని ఓ లగ్జరీ హోటల్‌లో సెక్స్ రాకెట్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై కొద్దిరోజులు నిఘా పెట్టిన పోలీసులు వ్యభిచారం జరుగుతోందని నిర్ధారించుకుని బుధవారం రాత్రి రైడ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు సెక్స్‌వర్కర్లను అదుపులోకి తీసుకోగా.. విటులు, నిర్వాహకులు పరారయ్యాడు. హోటల్ నుంచి భారీ సంఖ్యలో మద్యం సీసాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.ఈ వ్యభిచార దందాపై లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.

 

 

 

 

అది కూడా ప్రముఖల సహకారంతో భారీ సంఖ్యలో ఈ సెక్స్ రాకెట్ నడుస్తుంది..ఈ హోటల్లో భారీగా  సెక్స్ రాకెట్లు జోరుగా సాగుతున్నాయి..అయితే అక్కడ పట్టుబడ్డ మహిళలు కేరళ నుంచి వచ్చిన వారిగా గుర్తించారు..నగరంలోని మరో రెండు హోటళ్లలోనూ వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను ఇక్కడకు తీసుకొచ్చి వారి శరీరాలతో వ్యాపారం చేస్తున్నారు. సోషల్‌మీడియాలో వారి అర్ధనగ్న ఫోటోలు, వివరాలు పోస్ట్ చేసి విటులను ఆకర్షిస్తున్నారు. హోటల్స్‌లోని కొన్ని గదులను ప్రత్యేకంగా వ్యభిచారం కోసమే తీర్చిదిద్దుతున్నారు.

 

 

దేశ వ్యాప్తంగా పలు చోట్ల డబ్బులు లేక అమ్మాయిలు ఈ పరిస్థితుల్లో కి దిగారు..బాలికలపై కన్నేసిన ముఠాలు వారిని మాయమాటలతో మభ్యపెట్టి వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. సోషల్‌మీడియాలో వారి వివరాలు చూసి ఆసక్తి చూపిన విటుల నుంచి ముందుగానే ఆన్‌లైన్ ద్వారా మనీ ట్రాన్‌ఫర్ చేయించుకుంటారు. అనంతరం సెక్స్‌వర్కర్ వివరాలతో పాటు ఆమెను కలవాల్సిన ప్రదేశాన్ని వాట్సాప్‌లో లోకేషన్ పంపిస్తారు.అలా హోటల్లో ఎవరికి తెలియకుండా గదులను బుక్ చేసి విటులను పంపిస్తారు.. అలా పోలీసుల చేతికి దొరికిపోయారు...

మరింత సమాచారం తెలుసుకోండి: