ప్రభుత్వం ఎన్ని చట్టాలు ప్రెవేశపెట్టిన, ప్రజలకి ఎంత రక్షణ కల్పించిన గాని సామాన్యులకి భద్రత కరువయింది. అందరు చూస్తుండగానే పట్టపగలు ఒక వ్యక్తిని కొంతమంది దుర్మార్గులు పొట్టన పెట్టుకున్నారు. ఈ సంఘటన కూడా ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరగలేదు. పెద్ద హైటెక్ సిటీ లో జరిగింది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ కి అతి సమీపంలోనే జరిగింది. దీనితో ఒక్కసారిగా ఆ  ప్రాంతమంతా అలజడి నెలకొంది. అసలు వివరాలలోకి వెళితే.  స్టీల్ సిటీగా పిలవబడే విశాఖపట్నం లోనే  హత్య జరిగింది. ఈ హత్య కూడా పోలీస్ స్టేషన్‌కి అతి సమీపంలోనే జరిగింది. ఎవరో గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేసి పరారవడం స్థానికంగా సంచలనం కలిగించింది. ఈ ఘటన ప్రశాంతంగా ఉన్న విశాఖ ప్రజలను ఒక్కసారిగా కలవరపాటుకు గురిచేసింది.

 

 

 

నగరంలోని నాలుగో పోలీస్ స్టేషన్ సమీపంలో దారుణ హత్య చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు బండరాయితో తలపై మోది అమానుషంగా చంపేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.పట్టపగలు నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య స్టీల్ సిటీలో అలజడి రేపింది. పోలీస్ స్టేషన్‌కి అతి సమీపంలోనే గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేసి పరారయ్యారు.  నగరంలోని నాలుగో పోలీస్ స్టేషన్  పరిధి సమీపంలో   ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు బండరాయితో తలపై మోది అమానుషంగా చంపేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఇది చుసిన స్థానికులు వెంటనే పోలీసులకు  సమాచారం అందచేశారు.

 

 

 

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.  చనిపోయిన వ్యక్తి  అసలు ఎవరు, ఏ ఊరు, ఎక్కడవుంటారు బంధువులు ఎవరన్నా ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. అలాగే చంపిన వ్యక్తులు కూడా ఎవరన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. డబ్బులు కోసమో, ఆస్థి తగాదాలో, లేక కక్షలు ఎమన్నా ఉన్నాయా అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ క్రైం స్పాట్‌కి చేరుకుని ఆధారాలు సేకరించే పనిలో పడింది. నాల్గో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.అయితే మృతుడు ఎవరు అన్నది తెలిస్తే తప్ప  పూర్తి వివరాలు తెలియదు  తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: