ఎవరు పుట్టించారో, ఎందుకు పుట్టించారో తెలియదు.. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని మాత్రం అందరు చదవాలి.. అందరికి తెలియచేయాలి.. కనీసం కొందరికైనా ఇది చదివాక కనువిప్పు కలగాలి.. ఇక ప్రస్తుతం ప్రపంచం మొత్తం ప్రమాదకర స్దితిలోకి జారిపోతుంది.. తెలియకుండానే అణుబాంబులు పేలిన తర్వాత జరిగే విధ్వంసం చాపకింద నీరులా జరుగుతుంది.. దీనికంతటికి కారణం కరోనా.. ఎలాపుట్టిందో తెలియని ఒక సూక్ష్మ జీవి.. ఇది కంటికి క‌న‌ప‌డ‌దు. దాన్ని చూసిన వాళ్లెవ‌రూ లేరు. అయినా ప్రస్తుతం దీంతో యుద్ధం చేస్తున్నారు. ఒక్క చుక్క రక్తం బొట్టు చిందడం లేదు.. కాని కోట్లగుండెలు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకులీడుస్తున్నాయి..

 

 

ఎవరు అజ్ఞాతంలోకి వెళ్లే పరిస్దితులు లేవు.. కాని తప్పదు కళ్లముందు ఉంటూనే దూరంగా బ్రతకవలసిన పరిస్దితులు.. ఒక బిడ్దకు తల్లిపాలు పట్టాలన్న భయం.. ఒక తల్లి బిడ్దను ప్రేమగా ముద్దుపెట్టుకోవాలన్న భయం.. ఇలా భార్యభర్త, అన్నాచెల్లి ఒకటేమిటీ ప్రతి బంధం ఇప్పుడు భయకంపితులను చేస్తుంది.. ఒకరకంగా ఎవరికి తెలియకుండానే నిశ్శ‌బ్దంగా అన్నీ కుప్ప‌కూలి పోతున్నాయి.. ఊహించని నష్టాలన్ని ఒక్క సారిగా కమ్ముకునే పరిస్దితులు దొంగలా వస్తున్నాయి.. ఇలా ఎందుకంటే చైనా వాడు అడ్డమైన ఫుడ్డు తిని రోగాలు తెచ్చుకున్నాడని హేళన చేసాం.. కాని వాడు ఏది తిన్న తనదేశ ప్రజలను మొత్తానికి సురక్షితంగా కాపాడుకున్నాడు..

 

 

కానీ మనదేశ పరిస్దితి ఇందుకు భిన్నం. ఇక్కడ ఎవరు ఎవరి మాట వినరు.. మీడియా అంతా పనిగట్టుకుని ప్రచారం చేస్తుందంటారు.. ఒక్క సారి ఇటలీ అనుభవిస్తున్న దారుణమైన పరిస్దితులను తెలుసుకుంటే మనుషులుగా బ్రతకడం కంటే చావడం నయం అనిపిస్తుంది.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దారుణాలను చూస్తుంటే మూడోప్రపంచ యుద్ధం జరిగినా లోకంలో ఇంత కఠినమైన జీవనం ఉండదేమో అనిపిస్తుంది..

 

 

ఎందుకంటే మనుషులంత స్వార్ధపరులు ఎవరు ఈ భూమి మీదలేరు.. తాను మాత్రమే బ్రతకాలని ప్రకృతిని, ప్రకృతిలోని జీవరాశులను నాశనం చేస్తున్నాడు.. విధికే ఎదురు తిరుగుతూ, మరో సృష్టి చేస్తున్నాడు.. మనిషిగా బ్రతుకురా అంటే మానవత్వాన్ని చంపుకుంటున్నాడు.. తానొక్కడే ఈ భూమండలాన్ని ఏలాలని కలలు కంటున్నాడు.. తాను సృష్టించే విధ్వంసంలో ఎన్ని మూగజీవాలు బలైపోతున్నాయో కంటికి కనబడటం లేదా.. మరెందుకు అత్యాశ.. ఇదిగో ఈ అత్యాశవల్లే ఈనాడు ఈ కరోనా అనే రోగాన్ని ప్రకృతి సృష్టించింది.

 

 

ఇదే కాదు ఈ భూమిమీద పుట్టిన ప్రతి ప్రాణికి ఇక్కడ జీవించే హక్కు ఉంది.. ఇది కాదని ఇలాంటి పిచ్చి చేష్టలు ఎన్ని చేసినా వాటిని బ్యాలన్స్ చేయడానికి ఇదిగో ఇలాగే కరోనా లాంటి రోగాలు మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాయి.. ఈ కరోనాతో అయినా మనిషి అని చెప్పుకునే ప్రాణిలో మార్పువస్తే సరి.. లేకుంటే ఏ యుద్ధాలు జరగకుండానే ఈ జీవరాశి అంతరించి పోతుందని తెలుసుకోవాలి.. ఒక్క సారి ఆలోచించండి.. మన తాతల కాలం నుండి మన పిల్లవరకు మారిన మారుతున్న పరిస్దితులను.. అర్ధం చేసుకునే వారైతే మీకే అర్ధం అవుతుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: