కమ్మరాజ్యంలో కడప రెడ్లు అంటూ ఆ మధ్య ఆర్జీవీసినిమా తీశాడు.. ఆ తర్వాత సెన్సార్ వాళ్ల ఆత్మ సంతృప్తి కోసం పేరు మార్చాడనుకోండి.. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎంపీ రాధాకృష్ణ కూడా ఇంచుముందు అదే టైపులో సంపాదకీయం రాశారు.. కాకపోతే.. దీనికి ఆ సినిమా టైటిల్ పనికిరాదు.. దీనికి రెడ్ల రాజ్యంలో కమ్మ కష్టాలు అని పెడితే బావుంటుందేమో మరి.

 

 

ప్రతి ఆదివారం రాధాకృష్ణ వెలువరించే కొత్తపలుకులో ఇవాళ కమ్మ కష్టాల గురించి రాధాకృష్ణ ఏకరవు పెట్టారు. రాష్ట్రంలో కమ్మవారికి అన్యాయం జరుగుతోంది. కమ్మకులాన్ని టార్గెట్ చేస్తున్నారు. జగన్ కు కమ్మవారంటే పడదు. కమ్మవారికి పనులు చేయడం లేదు. కమ్మవారి బిల్లులు చెల్లించడం లేదు. ఇదిగో ఇలా సాగిపోయిందా వ్యాసం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వున్న కమ్మవారి కష్టాలు అన్నీ ఆయన లిస్టవుట్ చేసి డిటైల్డు గా రాసుకొచ్చారు.

 

 

అంతే కాదు.. కమ్మ కులంపైనా ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇంతగా కమ్మోళ్లను కష్టపెడుతున్నా... కమ్మసంఘాలు మౌనంగా వుండడాన్ని ఆర్కే తప్పు పట్టారు. రెడ్లను ఏదో అన్నాడని జన సేనాని పవన్‌కల్యాణ్‌ నాలుక కోస్తామని రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు క్షణం ఆలస్యం చేయకుండా హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేసి కమ్మల్లో పౌరుషం నింపే ప్రయత్నం చేశారు. కమ్మ కులం వారిని పోలీసు శాఖలో వేధిస్తున్నా, ఇతర స్థానాల్లో ఉన్న అధికారులను మానసికంగా కుళ్లబొడుస్తున్నా కమ్మ సంఘాలు మాత్రం నోరు మెదపలేదు. అది సంస్కారమో, పిరికితనమో తెలియదు.. అంటూ కమ్మవారికి రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది.

 

అంతే కాదు.. ఆస్తులపై అంతులేని మమకారం ఉంటుంది కనుకే కమ్మవాళ్లు ఎన్ని అవమానాలనైనా భరిస్తారు అని అంటారు. కమ్మవాళ్లు ఎంతకైనా దిగజారతారు అని చెప్పడానికే వల్లభనేని వంశీ, కరణం బలరామ్‌ వంటి వారిని పార్టీలో చేర్చుకున్నామని వైసీపీకి చెందిన రెడ్డి నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.. అంటూ తాను కమ్మవారిని అనదలుచుకున్నవన్నీ అనేశారు. చూడాలి మరి ఈ వ్యాసంతోనైనా కమ్మవారు మేలుకొంటారో లేదో..?

మరింత సమాచారం తెలుసుకోండి: