దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ని ప్రజలు విజయవంతంగా అమలు చేసారు. ఎక్కడిక్కడ ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రాకుండా మోడీ ఇచ్చిన పిలుపుకి మంచి సపోర్ట్ ఇచ్చారు. అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా అమలు జరిగింది. మాట వినని వాళ్లకు పోలీసులు కాస్త గట్టిగానే సమాధానం చెప్పారు. హైదరాబాద్ సహా పలు నగరాలు అన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు ఎవరూ కూడా రోడ్ల మీదకు వచ్చే సాహసం చేయలేదు. కరోనాపై అందరూ కలిసి విజయవంతంగా ఇళ్ళల్లో ఉండి యుద్ధం చేసారు. ప్రతీ ఒక్కరు కూడా ఇంట్లోనే ఉన్నారు. 

 

వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఇళ్ళల్లోనే ఉన్నారు. ఎవరూ కూడా బయటకు రాలేదు. ఇది పక్కన పెడితే దీనికి సిని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది. సినీ స్టార్ లు అందరూ కూడా ఇళ్ళల్లో ఉండిపోయారు. షూటింగ్ లు అన్నీ బంద్ చేయడంతో ప్రతీ ఒక్కరు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఉండిపోయారు.  తెలుగు స్టార్ హీరోలు అందరూ కూడా ఇంటికే పరిమితం అయిపోయారు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, నానీ, అల్లు అర్జున్ అందరూ కూడా ఇళ్లకే పరీతం అయిపోయారు. 

 

ఒక్కరు అంటే ఒక్కరు కూడా బయటకు రాలేదు. ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేసారు అందరూ. షూటింగ్ లతో బిజీ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీ తో సమయం గడిపారు. ప్రతీ ఒక్కరు కూడా తమ ఫ్యామిలీ తో ఇంట్లో ఉండి ఆటలు ఆడుకున్నారు వాళ్ళ వాళ్ళ సినిమాలు చూసి ఎంజాయ్ చేసారు. ఇక కొంత మంది అయితే సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా పెట్టారు. అదే విధంగా బాలీవుడ్ హీరో లు అందరూ ఇళ్లకే పరిమితం అయిపోయారు. ఎవరికి వాళ్ళు ఇళ్ళల్లోనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: