పార్టీ ఎన్ని వాడుదుడుకుల్లో ఉన్నా,తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో మాత్రం మార్పు వచ్చేట్టు కనిపించడంలేదు. ఆ కారణంగానే కాంగ్రెస్ ఇక్కడ రోజు రోజుకి దిగజారుతున్నట్టుగా కనిపిస్తోంది. మొన్నటి వరకు తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఈ పదవి తమకు కావాలంటే తమకు కావాలంటూ నాయకులు ఎవరికి వారు పోటీ పడుతూ కనిపించారు. పార్టీ సీనియర్ నాయకులంతా తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి మీద ఆశలు పెట్టుకుని రచ్చ రచ్చ చేశారు. ఈ వ్యవహారం పార్టీ అధిష్టానానికి కూడా తెలనొప్పులు తీసుకొచ్చాయి. దీంతో ఈ వ్యవహారాన్నికాంగ్రెస్ అధిష్టానం కాస్త పక్కనపెట్టేసినట్టుగా కనిపించింది. ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరా కేసులో అరెస్ట్ అవ్వడంతో ఈ ప్రతిపాదన చాలావరకు వెనక్కి వెళ్ళిపోయింది.
ఈ సంగతి ఇలా ఉంటే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో మరో పదవి కోసం పెద్ద రగడే జరుగుతోంది. ఇక తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. గత రెండు పర్యాయాలు ఎన్నికలు జరగడంతో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వంశీ చంద్ రెడ్డి, ఆ తరువాత అనిల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. తాజాగా మాత్రం ఎన్నికలను ఆపేసి ఇంతకు ముందులా నామినేటెడ్ పద్దతికి వెళ్లాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ను యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికోసం ఢిల్లీ కేంద్రంగా ఎవరికి వారు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా తమ వారసులకు పదవి దక్కేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. అసలు వారసత్వ హవాకు అడ్డుకట్ట వేసేందుకు యువజన కాంగ్రెస్ ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టారు.అయితే అదే ఎత్తేసినప్పుడు ఇంకా వారసులకు అడ్డు ఏంటని ఆ వారసుల అనుచరులు ప్రశ్నిస్తున్నారట. సామాన్యులకు, సొంత డబ్బు ఖర్చుపెట్టుకుని గత నాలుగేళ్లు పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కనపెట్టి వారసులు రంగప్రవేశం చేసేందుకు సర్వం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ మాజీ మంత్రి కొడుకు ఒకరు ఈ పదవిని దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారట.
ఇలా ఇప్పుడు ఈ యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలో సీనియర్ నాయకుల మధ్య పోటీ నెలకొండడంతో మరోసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రచ్చ రచ్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణా యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రవికుమార్ యాదవ్, మహబూబ్ నగర పార్లమెంట్ అధ్యషుడు పోరిక సాయి శంకర్, నగర్ కర్నూల్ పార్లమెంట్ అధక్షుడు శివసేన రెడ్డి, క్రీం నగర పార్లమెంట్ అధక్షుడు నాగి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వినోద్, దిలీప్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గురజాల వెంకట్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.