పాపం ఏమి తెలియని వయసు. అమ్మ నాన్న అల్లారు ముద్దుగా పెంచారు. అయిదవ తరగతి చదువుతోంది ఆమె. ఆ పశువు చేతిలో చచ్చిపోయింది. ఎన్నో అత్యాచారాలు కనపడుతూనే ఉన్నాయి. నిర్భయ దోషులకు శిక్ష పడింది. ప్రపంచమంతా దారుణ స్థితి లో ఉంది. ఈ దరిద్రుడు మాత్రం చిన్నారిని రేప్ చేసి చంపేశాడు. దుఃఖం తో కుమిలిపోతున్నారు పాప తల్లిదండ్రులు. అయ్యో రామా అని మొత్తుకున్నా తిరిగి రాదే ప్రాణం. పాపం ఆ పశువు చేతిలో చచ్చిపోయింది.

 

 

చెన్నై లో జరిగింది ఈ ఘటన. ఒక్క గాన్నొక్క కూతురు ఈ జంటకి. చెన్నైలో రెండంతస్తుల మేడ లో ఉంటున్నారు ఈ ఫ్యామిలీ. అయితే రెండో అంతస్థులో మూడు పొర్షన్లు ఉన్నాయిట. ఒక దానిలో ఓనర్ ఫామిలీ ఉంటే, మరో పోర్షన్ లో నిందితుడు ఉన్నాడట. మూడవది ఖాళీగా ఉందిట. అయితే ఈ ఫ్యామిలీ మాత్రం రాజస్థాన్ నుండి వచ్చారట.

 

 

రాత్రి పది అయ్యేసరికి తల్లిదండ్రులు నిద్ర పోతే పాప మాత్రం వాష్ రూమ్ అని బయటకి వచ్చిందట, లైట్ గా మద్యం మత్తులో వున్నాడట ఈ నిందితుడు. ఆమెని పిలిస్తే తెలిసిన వాడే కదా అని ఆమె వెళ్లిందట. పైకి తీసుకుని వెళ్లడం తో ఈమె అరిచింది. అరవడానికి వీలు లేకుండా నోరు నొక్కేసి పైకి తీసికెళ్ళాట. ఆమె గట్టిగా అరవడంతో నాలుగు దెబ్బలు వేసాడు. అయితే పైకి తీసుకెళ్లి ఇంకా గట్టిగా కొట్టాడు.అరిస్తే చంపేస్తానని బెదిరించాడట.అయితే తన గదిలోకి తీసికెళ్ళి తలుపులేసాడు.

 

ఆమె ఇంకా సైలెంట్ అయ్యిపోయింది. తర్వాత తెల్లారాకా పక్కన పాప లేదని తల్లి భయపడి వెతికింది. పాప పైన స్పృహ లో లేకపోవడంతో కదిపింది. భయంతో భర్తని లేపింది. వారు ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. వేలు ముద్రలని గమనించి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసారు. పాపని రేప్ చేసాక వదిలేద్దామనుకున్నాడట. కానీ అందరికి తెలిసిపోతుందని పీక నొక్కి చంపేశాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: