ఈ మధ్య కాలంలో చాలా మంది వావీవరసలు మరిచిపోయి అక్రమ సంబంధాల వల్ల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దేశంలో ప్రతిరోజు అక్రమ సంబంధాల వల్ల పోలీస్ స్టేషన్లలో పదుల సంఖ్యలో ఫిర్యాదులు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల ఈ వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తున్నాయి. తాజాగా ఆడపడుచు భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ భర్త చేతిలో హత్యకు గురైంది. మహారాష్ట్రలోని నాసిక్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 
 
పూర్తి వివరాలలోకి వెళితే నాసిక్ లోని బసవంత టౌన్ లో సురేఖ, రవీంద్ర దంపతులు అద్దె ఇంట్లో నివాసం ఉండేవారు. రవీంద్ర సోదరి కుమారుడు విశాల్ వీరి ఇంటి దగ్గరే ఉండి చదువుకునేవాడు. రవీంద్ర సోదరి దంపతులు అప్పుడప్పుడూ కొడుకును చూడటానికి వచ్చి వెళుతూ ఉండేవారు. ఈ క్రమంలో సురేఖకు, రవీంద్ర బావకు మధ్య చనువు పెరిగింది. ఆ చనువు వివాహేతర బంధానికి దారి తీసింది. 
 
తరచుగా సోదరి భర్త ఇంటికి వస్తూ ఉండటంతో రవీంద్రకు అనుమానం మొదలైంది. ఒకరోజు పని మీద బయటకు వెళ్లినట్లు చెప్పి కొంత సమయం తర్వాత రవీంద్ర ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో తన భార్య, సోదరి భర్త నగ్నంగా అసభ్యకర రీతిలో ఉండటంతో షాక్ అయ్యాడు. భార్యను, సోదరి భర్తను హెచ్చరించి క్షమించి వదిలేశాడు. భర్త క్షమించి వదిలేసినా సురేఖ ప్రవర్తన ఏ మాత్రం మార్చుకోలేదు. 
 
భార్య ప్రవర్తనతో విసుగు చెందిన రవీంద్ర ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం సోదరి కొడుకు విశాల్ ను కూడా చంపేశాడు. ఆ తర్వాత గదిలోకి వెళ్లి రవీంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించటంతో పోలీసులు ఘటనా స్థలంలో మూడు మృతదేహాలను గుర్తించారు. రవీంద్ర సూసైడ్ నోట్ లో భార్య అక్రమ సంబంధం వల్లే రవీంద్ర ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: