ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంత ప్రమాదకరంగా మారుతుందో చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే నిమిషం నిమిషానికి కరోనా బాధితులు పెరిగిపోతున్నారు. ఈ క్రమంలోనే కరోనాపై చాలా మందిలో లేనిపోని అపోహలు ఉన్నాయి. అయితే వీటిలో వాస్తవ అవాస్తవాలపై సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది. ఇది ప్రతి ఒక్క భారతీయుడిని ఆలోచించేలా ఉంది. ఈ పోస్టు ప్రతి ఒక్కరు చదవాలి.. అలాగే ప్రతి ఒక్కరు షేర్ చేయాలి.
చైనా వాళ్ళు జనవరి-23 నుంచి ఇంట్లో కూర్చుని లాక్డౌన్లో ఉంటే నిన్న మొదటి సారి కొత్త కేసులు రాలేదు. దీని బట్టి మనం ఎంత జాగ్రత్త గా ఉండాలి ఆలోచించండి..
- మాకు ఏమి కాదు లే అని అనుకుంటే పొరపాటే..ఒకసారి ఇండియాలో పాకింది అంటే, కనీసం 1 కోటి మంది చనిపోతారు..
- వెల్లుల్లి, అల్లం, హోమియో, పసుపు, ఇవన్నీ వైరస్ ని చంపేసేవి అయితే, ప్రపంచం అంతా ఎప్పుడో అది వాడి దీన్ని కంట్రోల్ చేసేది..
- దయచేసి ఇంట్లో ఉండండి. చదువుకొని వాళ్ళకి ఈ వ్యాధి ఎంత ప్రమాదకరమో చెప్పండి..
- ఇటలీలో 1000 మందికి 2.5 బెడ్స్ ఉంటేనే అంత మంది చచ్చిపోయారు. అదే మనదేశంలో 1000 మందికి 0.5 బెడ్స్ మాత్రమే ఉన్నాయ్ హాస్పిటల్స్లో.. ఇక్కడ ఇంకెంత ప్రమాదకరమో ఆలోచిచండి.
- మేము బాగున్నాం, మాకు ఏమి కాదు, అని అనుకుంటే పొరపాటే.. ఇది గాలిలో నుంచి కూడా వస్తుంది అని ఇవాళే WHO చెప్పింది..
- ఇది ఆయుర్వేద, హోమియో, యునాని మరి ఏ ఇతరత్రా పద్దతి ద్వారా తగ్గేది కాదు. అలా తగ్గుతుంది అని లేదా రాదు అని ఎవరైనా చెపితే అది కేవలం వాళ్ళు డబ్బులు చేసుకోవడం కోసమే. అన్నది గమనించాలి.
- ఎక్కడికి వెళ్లద్దు. మీకు ఎవరిమీద అయిన ప్రేమ ఉంటే, వాళ్ళని చూడకుండా ఉండండి. దయచేసి ఎవరో పెళ్లి అనో, చూద్దాం అనో, చాలా రోజులు అయిందని తిరగద్దు.
- మనదేశంలో వాళ్ళకి ఇమ్మునిటీ ఎక్కువ, మాకు ఎండలు ఎక్కువ, వైరస్ చస్తుంది, ఇవన్నీ నిజాలు కావు.. అది ఏ టెంపరేచర్లో అయినా వ్యాపిస్తుంది..
- 1918లో ఇలానే ఫ్లూ వస్తే భారతదేశం లో 1కోటి మంది చచ్చిపోయారు..అపుడు విమానాలు లేవు, షిప్ లు ఇంత లేవు. అయినా కూడా అంత వ్యాపించింది..
- దయచేసి, మాకు భారత్లో కోవిడ్ కేసులు 300 మంది మాత్రమే ఉన్నారు అని తక్కువ అనుకోకండి..1 వారం లో నే ఇటలీ ఇరాన్ లో 300 నుంచి 6000-7000 వరకు 2 వారాలు లో 20,000 కు పెరిగిపోయాయి.
- చేతులు శుభ్రం గా సబ్బు తో కడుక్కోండి. కనీసం 20 సెకన్లు పాటు కడగాలి. ఊరికే మొహం, ముక్కు, నోరు, కళ్ళు, తాకావద్దు. ఇంట్లో ఉండండి. దగ్గు, జలుబు ఉంటే ఎవరిని తాకవద్దు..