భూమా అఖిలప్రియ దంపతులు ఇరుక్కోవటం ఖాయమనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  నంద్యాలలోని సీనియర్ టిడిపి నేత ఏవి సుబ్బారెడ్డి హత్యకు మాజీ మంత్రి అఖిలప్రియ దంపతులు సుపారి ఇచ్చారనే విషయం బయటపడటంతో జిల్లాలోను తెలుగుదేశంపార్టీలోను సంచలనంగా మారింది. ఏవి సుబ్బారెడ్డికి భూమా కుటుంబానికి చాలా కాలంగా గొడవలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆస్తి తగాదాలతోనే రెండు వర్గాల మధ్య గొడవలు తీవ్రస్ధాయికి చేరుకుని చివరకు ఏవి హత్యకు అఖిల సుపారి ఇచ్చిందని సమాచారం.

 

నాలుగు రోజుల క్రితం కడపలోని చిన్న చౌక్ లో అనుమానంతో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.  విచారణలో భాగంగా వీరిదగ్గర ఉన్న సంచీలో నుండి కంట్రీమేడ్ రివాల్వార్ బయటపడటంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. వీళ్ళముగ్గిరినీ గట్టిగా విచారిస్తే అసలు విషయం బయటపడింది. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లో ఉండే నంద్యాలకు చెందిన టిడిపి నేత ఏవి సుబ్బారెడ్డిని హత్య చేసే విషయంలోనే తాము ప్లాన్ చేసుకుంటున్నట్లు చెప్పటంతో పోలీసుల మైండ్ బ్లాంక్ అయ్యింది.

 

కర్నూలు జిల్లాలోని సంద్యపాకుల ఫక్కీర్ అలియాస్ ప్రతాప్ మరో ఇద్దరితో కలిసి ఏవి హత్యకు ప్లాన్ చేసినట్లు చెప్పారు. ఈ సుపారీని అఖిలప్రియ మద్దతుదారుడైన రవిచంద్రారెడ్డి, కుందూరు రామిరెడ్డి అప్పగించినట్లు పోలీసుల విచారణలో చెప్పాడు. ఫకీర్ చెప్పిన వివరాలతో పోలీసులు మిగిలిన ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో  ఏవి హత్య బాధ్యతను అఖిలప్రియ, భర్త బార్గవ్ తమకు అప్పగించినట్లు వీరు చెప్పారని సమాచారం.

 

వీళ్ళిచ్చిన సమాచారంతో పోలీసులు ఏవిని పిలిపి మాట్లాడితే ఆయన కూడా అఖిల దంపతుల మీద తనకు అనుమానం ఉన్నట్లు చెప్పాడని సమాచారం. సో ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే అఖిలప్రియ దంపతులను పిలిచి విచారించటమే మిగిలిందని అనిపిస్తోంది. ఒకసారి విచారణకు పిలిపిస్తే దంపతులను అరెస్టు చేయటం ఖాయమే అంటూ టిడిపిలో బాగా ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: