రోజురోజుకి ప్రపంచ మానవాళిపై విరుచుకుపడుతూ మారణహోమం సృష్టిస్తున్న కరోనా వైరస్‌ ను పురాణాల్లోని ‘కర్కటి’ రాక్షసితో పోలుస్తున్నారు ప్రజలు. కొన్ని వేల సంవత్సరాల పూర్వం హిమాలయాలకు ఉత్తరాది మానవాళిపై ఎగబడిన 'కర్కటి' అనే మహమ్మారే ఇప్పుడు 'కరోనా' పేరుతో మానవాళిని భయపెడుతోంది అని అంటున్నారు. మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి శుక్రబ్రహ్మాశ్రమ వ్యవస్థాపకులు శ్రీ విద్యాప్రకాశానంద గిరి స్వామీజీ కొన్ని దశాబ్దాల క్రితం రాసిన ‘యోగ వాశిష్టం’ పుస్తకంలో ఉన్న ‘కర్కట్యుపాఖ్యానం’ గురించి ప్రస్తావిస్తూ ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

 

 

అందులో యోగ వాశిష్టంలోని 'కర్కట్యుపాఖ్యానం'లో  కర్కటి అనే మహమ్మారి బ్రహ్మదేవుడి కోసం వేల సంవత్సరాలు తపస్సు చేసినట్టు, ఈ కర్కటి కనిపించిన జీవజాతులను చంపేసి తినే స్వభావం కలిగినదని, అయితే ఇది తేలిగ్గా ఒక నీడిల్‌ గా మారి ప్రజలను ఎడాపెడా తినాలనే కోరికతో ఘోర తపస్సు చేసిందని అందులో తెలిపి ఉంది. తన ఘోర తపస్సుకు బ్రహ్మ దేవుడు మెచ్చి వరమిచ్చాడని కాబట్టి అది మంచి వాళ్లు, చెడ్డ వాళ్లు అని కూడా చూడకుండా కనపడిన మనుషులపై విరుచుకుపడి రక్త మాంసాలు చూసిందని యోగ వాశిష్టంలో ఆయన చెప్పారు. 

 

 

అది చూపుతూ అదే ఇప్పుడు కరోనా వచ్చిందని నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. దీనికి ముందు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో కరోనా వైరస్ గురించి ఎప్పుడో చెప్పారనే ప్రచారం కూడా బాగా జరిగింది. నిజానికి ఎవరెన్ని ప్రచారాలు చేసినా, కరోనా వైరస్‌ కు మాత్రం విరుగుడు కనిపెట్టే పనిలో శాస్త్రవేత్తలు తలకిందులై ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ శాస్త్రవేత్తల ప్రయోగం ఫలితాలు వచ్చే వరకూ ఎవరికి వారు మంచిగా జాగ్రత్తలు పాటించడమే మంచిదని తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ ప్రపంచం పూర్తిగా ఎప్పుడు కరోనా గుపెట్లో నుంచి బయట పడుతుందో చూడాలి. మీ అందిరికి చెప్పతగింది ఏమిటంటే ఎవరికీ వారు తగిన జాగ్రత్తలు తీసుకోని నిర్ములించడమే ఈ మహమ్మారికి అసలైన విరుగుడు. సో బి కేర్ఫుల్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: