కరోనా దెబ్బకు ఒక తెలుగు దిన  పత్రికకు ఈ నెల 31 వతేది వరకు సెలవు ప్రకటించారు . ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే బెటరని పత్రిక  సిబ్బంది కూడా యాజమాన్య నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు . గతంలో వార్త విశేషాలు తెలుసుకునేందుకు ప్రజలు కేవలం పత్రికలపైనే ఆధారపడేవారు . కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది . ఎలక్ట్రానిక్ మీడియా తో పాటు సోషల్ మీడియా విస్తృతి పెరిగింది . దాంతో వార్త విశేషాలు ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకునే వెసులుబాటు లభించింది .

 

అయినా ఒక సంఘటన గురించి సమగ్ర సమాచారం తెలుసుకునేందుకు మాత్రమే ప్రజలు  పత్రికలపై ఆధారపడుతున్నారు . కరోనా వంటి ప్రాణాంతక వైరస్ విస్తృతిని అడ్డుకునేందుకు సదరు తెలుగు దినపత్రిక యాజమాన్యం  తమ సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టడం ఎందుకనీ  భావించిందో ఏమో కానీ , పాత సంప్రదాయానికి స్వస్తి చెప్పి , వారం రోజులపాటు సెలవు ప్రకటించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది . ఇక   అదే దారిలో మరికొన్ని పత్రికలు నేడో, రేపో సెలవులు ప్రకటించే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు విన్పిస్తున్నాయి  . ఇప్పటికే కొన్ని ఆంగ్ల దినపత్రికలు  హోమ్ టూ వర్క్ పద్దతిలో పని చేయాలని తమ సిబ్బందిని ఆదేశించాయి .

 

సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ సిబ్బందికి హోమ్ వర్క్ పద్దతి ద్వారా పని చేయించుకుంటున్నప్పుడు , కరోనా కట్టడికి  పత్రికల యాజమాన్యాలు కూడా అదే పద్దతిలో పని చేయించుకుంటే మంచిదన్న సలహా   , సూచనలు ప్రభుత్వం చేస్తే మంచిదని పలువురు సూచిస్తున్నారు .  ఇక ఆఫీస్ కే వచ్చి పని చేయాలన్న వితండ వాదాన్ని పత్రికల యాజమాన్యాలు కూడా వీడనాడితే మంచిదని జర్నలిస్ట్ కమ్యూనిటీ నుంచి సూచనలు విన్పిస్తున్నాయి . లేనిపక్షం లో జర్నలిస్టుల ప్రాణాలతో చెలగాటమాడినట్లు అవుతుందని అంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: