ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో  స్టార్ హీరోల్లో ఒకరిగా... అభిమానుల స్టైలిష్ స్టార్ గా కొనసాగుతున్నారు అల్లు అర్జున్. మెగా మేనల్లుడుగా .. అల్లు వారి వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అల్లు అర్జున్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాడు. ఇక ముఖ్యంగా అల్లు అర్జున్  స్టైల్ కి ఎవరు సాటిరారు అనే చెప్పాలి... తనదైన డాన్సులతో ఇరగదీస్తు... అద్భుతమైన యాక్షన్ తో అదరగొడుతు.. యూనిక్ స్టైల్ తో అందరిని మెస్మరైజ్ చేస్తూ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇక మొన్నటికి మొన్న అలా వైకుంఠపురములో సినిమా తో మంచి జోష్ మీద ఉన్నాడు. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన అలా వైకుంఠపురములో సినిమా... సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. 

 

 

 అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అల వైకుంఠ పురములో సినిమా. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా భారీగానే వసూళ్లు రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చి పెట్టింది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ త్వరలో కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నారు అని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. సినిమా ఇండస్ట్రీ కి అస్సలు సంబంధం లేని కొత్త వ్యాపారంలోకి అల్లు అర్జున్ అడుగుపెట్టబోతున్నాడట. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ అడుగుపెడుతున్న వ్యాపారంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ అల్లు అర్జున్ ఏ వ్యాపారం లో అడుగుపెట్టాడు అంటారా... సెలబ్రిటీల ఇళ్ళల్లో జరిగే శుభకార్యాలకు... పెద్ద పెద్ద సెలబ్రిటీలు రావడం అనేది మామూలుగా జరిగే విషయమే. అలా  పెద్ద పెద్ద సెలబ్రిటీలు శుభకార్యాలకు హాజరయ్యే  సమయంలో... వారి ప్రయాణానికి కావలసిన ఖరీదైన కార్లను అద్దెకు ఇచ్చే ఓ కంపెనీలో అల్లుఅర్జున్ ఏకంగా ఏడు శాతం వాటాను దక్కించుకున్నట్లు సమాచారం. 

 

 

 అయితే అల్లు అర్జున్ తో పాటు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా ఇందులో వాటా దక్కించుకున్నారని వార్త సోషల్ మీడియాలో ఎక్కువగా వినబడుతుంది. అయితే సినిమా రంగానికి చెందిన అల్లు అర్జున్... తనకు కొంచమైన టచ్ లేని కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు అనే టాక్ వినిపిస్తోన్న  నేపథ్యంలో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకూ నిజం అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: