క‌రోనా వైర‌స్ రోజురోజుకూ విజృంభిస్తోంది. దాని బారిన ప‌డి మృతి చెందుతున్న వారి సంఖ్య అమాంతంగా పెరిగిపోతోందని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రిస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మృతుల సంఖ్య ఏకంగా 16500 ఉంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ సంఖ్యను చూసి ప్ర‌పంచ దేశాలు వ‌ణికిపోతున్నాయి. ఇప్ప‌టికే ల‌క్ష‌లాది జ‌నం ఈ వైర‌స్ బారిన‌ప‌డి చికిత్స పొందుతున్నారు. మ‌రోవైపు కరోనా వైరస్‌  కట్టడికి ప్రపంచ దేశాలు తమ చర్యలను వేగవంతం చేశాయి. ఇప్పటికే 50కి పైగా దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఆ జాబితాలో ఫ్రాన్స్‌, ఇటలీ, అర్జెంటీనా, అమెరికా, ఇరాక్‌, రువాండా, గ్రీస్‌ చేరాయి. బుర్కినా ఫాసో, చిలీ, ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలా, సెర్బియా, మౌరిటాని యా దేశాలు కర్ఫ్యూ విధించగా, సోమవారం సాయంత్రం నుంచి సౌదీ అరేబియా ఆ జాబితాలో చేరింది. ఇరాన్‌, జర్మనీ, బ్రిటన్‌లు త మ ప్రజలను ఇండ్లలోనే ఉండాలని కోరా యి. 10 దేశాలు కర్ఫ్యూతోపాటు రాత్రివేళ ప్రయాణాలపై నిషేధం విధించాయి.

 

 174 దేశాల్లో సోమవారం నాటికి 15,873 మంది మృతి చెందారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సంఖ్య 16500కు చేరిందంటే వైర‌స్ ఎలా విజృంభిస్తుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక‌ 3,50,142 మందికి వైరస్‌ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. 50కి పైగా దేశాలు 170 కోట్ల మంది ప్రజలను ఇండ్లకే పరిమి తం కావాలని కోరాయి. తాజాగా మరణాల్లో చైనా కంటే ముందు ఇటలీ ఉండ‌డం గ‌మ‌నార్హం. ఆ దేశంలో మ‌ర‌ణ‌మృదంగం కొన‌సాగుతోంది. సోమవారం నాటికి 6,077 మంది మృత్యువాత పడగా, 63,927 మంది వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ఇదే స‌మ‌యంలో చైనా క‌రోనాపై ప‌ట్టుసాధిస్తోంది. స్థానికంగా కేసులు నమోదు కావడం నిలిచిపోయింది. కొత్తగా విదేశాల నుంచి వచ్చిన వారిలో 39 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలగా, తొమ్మిది మంది మరణించారు. దీంతో చైనాలో మృతుల సంఖ్య 3,270కు చేరగా, 81,093 మందికి వైరస్‌ సోకింది. స్పెయిన్‌లో 2,207 మంది, ఇరాన్‌లో 1,812, ఫ్రాన్స్‌లో 674, అమెరికాలో 501 మంది మరణించారు. మ‌రోవైపు అమెరికా సెనెటర్‌ రాండ్‌ పాల్‌కు కరోనా వైరస్‌ సోకింది. చెక్‌ రిపబ్లిక్‌, నైజీరియా, మాంటెనెగ్రోలలో ఆదివారం తొలి మరణాలు నమోదయ్యా యి. పాపువా న్యూగునియా, సిరియాల్లో తొలి కేసులు రికార్డయ్యాయి. పశ్చిమాసియాలో 1841 మృతు లు నమోదు కాగా, 26,688 మందికి వైరస్‌ సోకింది. ఆఫ్రికాలో 49 మంది మృతి చెందగా, 1,479 కేసులు నమోదయ్యాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: