ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు పరిస్థితి చాలా దయనీయంగా మారింది. 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో కనీసం పార్టీలో ఉన్న నాయకులు కూడా పెద్ద బాబు మాట పట్టించుకోవడం లేదు. గెలిచినా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగా మీడియా ముందే చంద్రబాబుని ఆయన తనయుడు నారా లోకేష్ ని బండ బూతులు తిట్టిన సందర్భాలున్నాయి. ఇటువంటి తరుణంలో రాజకీయంగా రాష్ట్రంలో మరియు అదే విధంగా జాతీయ స్థాయిలో కూడా పూర్తిగా తన పేరు కనుమరుగవుతున్న నేపథ్యంలో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

 

అదేమిటంటే గత సార్వత్రిక ఎన్నికలలో ప్రధాని మోడీ ని భయంకరంగా విమర్శిస్తూ ఎన్నికలలో వ్యతిరేకంగా ప్రచారం చేయటం జరిగింది. అయితే జరిగిన ఎన్నికలలో మోడీ భారీ మెజార్టీతో రెండోసారి ప్రధాని పీఠంపై కూర్చోవడం జరిగింది. దీంతో రాజకీయంగా తనకు చివరి రోజులు వచ్చాయి ఏమో అనుకున్నారేమో తెలియదు గానీ చంద్రబాబు మళ్లీ ఇప్పుడు మోడీ భజన మొదలుపెట్టారు. ఇటీవల దేశంలో కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ విధించడం జరిగింది. చాలామంది సెలబ్రిటీలు మరియు వివిధ రాష్ట్రాలు కూడా ప్రధాని మోడీ మాటను గౌరవించి కర్ఫ్యూను నటించడం జరిగింది.

 

దీనికి ప్రధాని మోడీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. అయితే సందట్లో సడేమియా అన్నట్లుగా చంద్రబాబునాయుడు కూడా ప్రజలకు ధన్యవాదాలు చెప్పేశారు. ఇక్కడ సీన్ చూస్తే ఏదో తాను పిలుపు ఇస్తే ప్రజలందరూ కర్ఫ్యూ పాటించినట్లుగా బిల్డప్ ఇస్తూ.. చంద్రబాబు అందిరికీ కృతజ్ఞతలు చెప్పేశారు. లేదా.. ఇలా మోడీ తరఫున మాట్లాడడం ద్వారా.. మోడీని ప్రసన్నం చేసుకుని బాబు గారు మళ్లీ భజన చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు చంద్రబాబు పై సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. మీ గొప్పలు చెప్పుకోవడానికి...పబ్లిసిటీ తెచ్చుకోవడానికి నీ తర్వాతే ఎవరైనా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: