దేశమంతా లాక్ డౌన్ అయ్యింది. రాష్ట్రంలోనూ లాక్ డౌన్ ఉంది. బయటకు వెళ్తే చాలు.. పోలీసులు కుమ్మేస్తున్నారు. అలాగని అత్యవసరాల కోసం బయటకు వెళ్లక తప్పట్లేదు. ఇలాంటి పరిస్థితి వస్తుందని పెద్దగా ఊహించని వారు సరుకుల కోసం మథన పడుతున్నారు. 21 రోజులు అంటే మాటలు కాదు.. మరి నిత్యాసవరాలు ఎలా.. ఇలా ఆలోచిస్తున్నవారికి ఇప్పుడు జగన్ సర్కారు ఓ గుడ్ న్యూస్ చెబుతోంది.

 

 

ఇక ఆంధ్రప్రదేశ్‌లో తోపుడు బండ్ల ద్వారా.. ఇళ్ల వద్దకే సరుకులను పంపిస్తామని ముఖ్యమంత్రి అదనపు చీఫ్ సెక్రటరీ డాక్టర్ పీవీ రమేష్ చెబుతున్నారు. ప్రజలు తప్పకుండా స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. నిత్యవసర వస్తువుల దుకాణాలను రోజంతా తెరిచి ఉంచే ఆలోచన కూడా ఉందని ముఖ్యమంత్రి అదనపు చీఫ్ సెక్రటరీ డాక్టర్ పీవీ రమేష్ అన్నారు. తోపుడు బళ్ల ద్వారా ఇళ్ల వద్దకే నిత్యవసర వస్తువులను తెచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు. కాగా స్వీయ నియంత్రణ పాటిస్తున్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా, రవాణా విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి అదనపు చీఫ్ సెక్రటరీ డాక్టర్ పీవీ రమేష్ పేర్కొన్నారు.

 

 

నిజంగా ఇలా చేస్తే ప్రజల ఇబ్బందులు చాలా వరకూ తీరిపోతాయి. ఇంకా ముఖ్యమంత్రి అదనపు చీఫ్ సెక్రటరీ డాక్టర్ పీవీ రమేష్ ఏం చెప్పారంటే.. కరోనా వల్ల ఆందోళన వద్దని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దాన్ని జయించవచ్చన్నారు. వైద్య సేవలు అందించేందుకు రిటైర్ అయిన డాక్టర్లు, నర్సుల వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ప్రతీ కుటుంబానికి బియ్యంతో పాటు వెయ్యి రూపాలయని అందిస్తామని ముఖ్యమంత్రి అదనపు చీఫ్ సెక్రటరీ డాక్టర్ పీవీ రమేష్ తెలిపారు.

 

 

కరోనా లక్షణాలు ఉంటే.. పారాసిట్ మాల్-650 ఎంజీ వేసుకోవచ్చు కానీ.. యాస్ప్రిన్ వేసుకోవద్దని పీవీ రమేష్ సూచించారు. డాక్టర్ల సూచనలు లేకుండా అమెరికాలో హైడ్రో క్లోరిక్విన్ వినియోగించి.. ఓ దంపతులు చనిపోయిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. ఏ మందులు పడితే అవి వేసుకోవడం మంచిది కాదని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: