మీరు బీటెక్ చేశారా.. ఇంజినీరింగ్ లో డిగ్రీ ఉందా.. అయితే ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే. ముంబయిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. ఎన్పీసీఐఎల్ 200 వరకూ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. పోస్టు పేరు.. ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ.. మొత్తం ఖాళీలు: 200 వరకూ ఉన్నాయి. ఇక విభాగాల వారీ ఖాళీలు చూస్తే.. మెకానికల్-85, కెమికల్-20, ఎలక్ట్రికల్-40, ఎలక్ట్రానిక్స్-08, ఇనుస్ట్రుమెంటేషన్-07, సివిల్-35, ఇండస్ట్రియల్ అండ్ ఫైర్ సేఫ్టీ-05 వరకూ ఉన్నాయి.
ముందే చెప్పుకున్నట్టు వీటికి అర్హత సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్)/ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే 2018/ 2019/ 2020 వాలిడ్ గేట్ స్కోర్ కూడా ఉండాలి. వయసు: 02.04.2020 నాటికి 26 ఏళ్లు మించకూడదు.
వాలిడ్ గేట్ స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 24, 2020. న ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 02, 2020 న ముగుస్తుంది. మరిన్ని వివరాల కోసం
https://npcilcareers.co.in/ అనే వెబ్ సైట్ ను చూడవచ్చు.
ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. పడకపోవచ్చు. కానీ దీన్ని మీ వాట్సప్ గ్రూపుల్లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్టు చేయండి. అవసరమైన వారికి ఇది ఉపయోగపడుతుంది. మనం అనవసరంగా ఎన్నో పోస్టులు ఫార్వార్డ్ చేస్తుంటాం. ఇలా పనికొచ్చే ఉద్యోగ సమాచారం పంపితే ఎవరికైనా ఉపయోగపడొచ్చు.