సంక్రాంతి కానుకగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ సినిమా వసూళ్ళ పరంగా కూడా భారీ విజయం సాధించింది అనే చెప్పవచ్చు. అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రాలలో ఇది ఒకటి. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా భారి విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

 

 ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సినిమా అనేది ఆసక్తికరంగా మారింది. అతను బాలీవుడ్ లో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. అతను బాలీవుడ్ లో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అల వైకుంఠపురములో సినిమాను బాలీవుడ్ లో కూడా విడుదల చేయాలి అని భావించారు. 

 

అయితే ఆ సినిమాను రీమేక్ చేయడానికి కొందరు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. కరణ్ జోహార్ ఈ సినిమాను బాలీవుడ్ లో చేసేందుకుగాను కాస్త ఎక్కువగానే ప్రయత్నిస్తున్నాడు. అదేవిధంగా అల్లు అరవింద్ తో ఇప్పటికే బోనికపూర్ కూడా ఈ సినిమాను బాలీవుడ్ లో చేయడానికి సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా తానే చేస్తాను అని అల్లుఅర్జున్ స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాత అల్లు అరవింద్ కూడా అల్లు అర్జున్ అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను చేసేవిధంగా ఇప్పటికే సంప్రదింపులు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. ఎన్టీఆర్ తో సినిమా అయిన తర్వాత త్రివిక్రమ్సినిమా బాలీవుడ్ లో చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: