శ్రీను వైట్ల - కోన వెంకట్, గోపీ మోహన్ కాంబినేషన్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కాంబోలో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. అసలు కామెడీకి ఈ కాంబినేషన్ పెట్టింది పేరు. ఇక శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన చాలా సినిమాలు సూపర్ హిట్ అవడానికి కారణం అతని దగ్గర రైటర్ గా పని చేసిన కోన వెంకట్ గోపి మోహన్ లకు ఆ తర్వాత శ్రీను తీవ్రమైన విబేధాలు వచ్చాయి.
చివరకు వీళ్లు వర్క్ చేసిన సినిమాలు ఒకరివి ప్లాప్ అయితే మరోకరు ఆనందించే వరకు పరిస్థితులు వచ్చేశాయి. వీరి కాంబినేషన్ ఫెయిల్ అయ్యాక శ్రీను వైట్లకు సరైన హిట్ లేదు. ఆ తర్వాత కోన వెంకట్ రైటర్గాను.. నిర్మాత.. దర్శకుడిగాను అనేక ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. అసలు వీరిద్దరికి ఎందుకు గొడవ వచ్చింది ? అసలు ఏం జరిగిందన్నది పెద్ద మిస్టరీయే. దీనిపై తాజాగా కోన వెంకట్ అలీ తో జాలిగా ప్రోగ్రాంలో గొడవకు కారణం రివీల్ చేశాడు.
ఎక్కడైనా టీం వల్లే సక్సెస్ అనేది వస్తుందని... కాని శ్రీను వైట్ల విషయంలో ఆ టీం వర్క్ ఎక్కడో బ్రేక్ అయ్యిందని నేను ఫీల్ అయ్యా.. దూరంగా ఉంటే మంచిదని కట్ చేశానని అలా ఆ విబేధాలు ఎందుకు వచ్చాయో చెప్పాడు. ఇక తాను రైటర్ అవడానికి కారణం ఆర్జీవీ అని, దర్శకుడు కావడానికి ఆర్జీవీ అని, ఇక రైటర్ కాకపోవడానికి కారణం కూడా ఆర్జీవినే అంటూ ఫన్నీగా చెప్పాడు. అయితే ఈ ఇద్దరు విడిపోయినా తర్వాత రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమా కోసం కలిపి పనిచేశారు. ఆ సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఆ సినిమాలో తాను ఇచ్చిన సీన్లు కూడా శ్రీను వైట్ల వాడలేదని మళ్లీ కోన వెంకట్ అన్నట్టు ప్రచారం జరిగింది.