మనిషి జీవితంలో ఎప్పుడు ఎలాంటి వైపరీత్యాలు చోటు చేసుకుంటాయో ఎవ్వరూ ఊహించలేరు. సాఫీగా సాగుతున్న జీవితాన్ని కబళించడానికి ఒక్క సంఘటన చాలు. అలాంటి అతి దారుణమైన సంఘటన గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో చోటు చేసుకుంది. ఒక ముసలావిడను సొంత మనవడే సిలిండర్ తో కొట్టి హతమార్చాడు. ఈ సంఘటనతో చిలకలూరిపేట ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న పోలూరి సుబ్బాయమ్మ(60) మనవడి చేతిలో దారుణ హత్యకు గురైంది.  నాన్నమ్మను మనవడు చంపడమేంటి అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

 

 

వివరాల్లోకి వెళ్తే, సుబ్బాయమ్మ మనవడికి మతిస్థిమితం లేదు. ఎప్పటి నుండో ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఎన్నో సార్లు సుబ్బాయమ్మను ఇబ్బంది పెట్టాడు. సొంత మనవడు కాబట్టి ఆమె ఓర్చుకుని, అన్నిటినీ భరిస్తూ వచ్చింది. తన మనవడిని ఎంతో ప్రేమగా చూడసాగింది. కానీ అదే మనవడు ఆమెను దారుణంగా కొట్టి, ఆమె ప్రాణాలు తీసాడు. ప్రేమగా చూసుకునే నాన్నమ్మను అతను ఇలా చేయడం చాలా బాధాకరం. అతని మానసిక పరిస్థితి బాగోలేక, విచక్షణా రహితంగా ఈ దారుణానానికి పాల్పడ్డాడని స్థానికుల అంచనా. ఈ హత్య జరిగే ముందు అతను సుబ్బాయమ్మతో ఎదో గొడవపడి ఉండుంటాడనీ, ఆ కోపంలోనే ఆమెను హతమార్చి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

 

ఈ సంఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ళు అక్కడికి చేరుకునే లోపే ఆమె మరణించింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని హంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. సుబ్బాయమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఈ కేసులో చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు మతిస్థిమితం లేని వ్యక్తిని స్వేచ్ఛగా ఎందుకు వదిలేసారు? ఇప్పుడు అతనికి శిక్ష పడుతుందా? లేక అతని మానసిక పరిస్థితి బాగోలేదు కాబట్టి అతన్ని మానసిక వైద్యశాలకు పంపిస్తారా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: