బ్రతుకు బ్రతికించు ఒకప్పటి మాట.. నాశనం అవ్వు, పక్కవాడిని నాశనం చేయి ఇప్పటి మాట.. ఈ అక్షరాలను నిజం చేస్తున్నారు కొందరు వెధవలు.. లోకం మొత్తం ఏ క్షణం ఎలా ఉంటుందో, ఎప్పుడు ఏ వార్త వినవలసి వస్తుందో అని భయం భయంగా బ్రతుకుంటే.. కామాన్ని ఒంటినిండా అద్దుకుని, తోడేల్లాంటి కళ్లు వేసుకుని గాలిస్తున్నారు గాలి వెధవలు.. ఇప్పటికే లోకంలో అమ్మ, అక్క, చెల్లి, కూతురు, వదిన అనే వావివరసలు మరచి తుచ్చమైన శరీర వాంఛల కోసం పశువుల్లా మారుతున్నారు.. చివరికి పశువులను కూడా వదలడం లేదు దరిద్రులు..

 

 

ఇక ఒకవైపు కరోనా పాపపుణ్యాలు ఆలోచించకుండా వికృతంగా, అందిన వారిని అందినట్లుగా కాటేస్తుంటే, కాస్త భయం కూడా లేకుండా అత్యాచారాలకు ఎగబడుతున్నారు ఏబ్రాసి వెధవలు.. ఇకపోతే ఏడు నెలల గర్భిణి అని కూడా చూడకుండా, ఒక మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారానికి యత్నించిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు చూస్తే.. చిత్తూర్, కేవీబీపురం..మండలంలోని అంజూరు దళితవాడకు చెందిన సాయి (24), వినోద్‌ (25) అనే వ్యక్తులు అంజూరు గ్రామం తెలుగు గంగ కాలువ సమీపంలో ఉన్న తమ సొంత పొలాల వద్దకు వెళ్లి తిరిగి గిరిజన కాలనీ వైపు వస్తుండగా... వారికంటికి ఒంటరిగా ఉన్న ఏడు నెలల గర్భిణిని కనిపించింది..

 

 

వెంటనే వారిలో దాగి ఉన్న కామాంధుడు నిద్రలేవగా మానవత్వం మరచి అత్యాచారయత్నానికి ప్రయత్నించగా, ఆ గర్భిణి ప్రతిఘటించడంతో అందులో ఉన్న ఒక వెధవ అయినా వినోద్‌ బయటికి వెళ్లిపోయాడు. కానీ మరో వెధవ అయినా సాయి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో భయపడిన బాధితురాలు కేకలు వేసింది... దీంతో స్థానికంగా ఉన్న కూలీలు అక్కడికి చేరుకోవడంతో నిందితులు పరారయ్యారు. దీనిపై బాధితురాలి బంధువులు కేవీబీపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. ఇక లోకంలో కరోనా వచ్చి కుక్కచావు చస్తుంటే ఇలాంటి వెధవలు బాధ్యతలేకుండా ప్రవర్తిస్తున్నారు అని నెటిజన్స్ అనుకుంటున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: