కరోనా కుటుంబాలలో కలహాలు కూడా సృష్టిస్తుంది.. ఇన్నాళ్లూ పనిచేసుకుని పొట్టపోషించుకునే వారు ఇప్పుడు ఖాళీగా ఇంట్లో కూర్చోవడంతో పొద్దుబోక కయ్యాలు పెట్టుకుంటున్నారు.. అసలే ఆర్ధిక సమస్యలు. అందులో ఇంట్లో తాగుబోతులు కనుక ఉంటే ఆ ఇల్లాలుకు నరకమే.. అందుకే దాదాపు కూలిపని చేసుకుని బ్రతికే జీవితాల్లో కరోనా చీకట్లను నింపుతుందని చెప్పవచ్చు.. ఇకపోతే ఒక తాగుబోతు భర్త తన భార్యతో గొడవ పడి మరీ దారుణానికి తెగించాడు.. మరుగుతున్న నూనెను పడుకున్న తన భార్యపై పోసి పరార్ అయ్యాడు..

 

 

అసలే బయట అంతా గందరగోళంగా మారిన పరిస్దితుల్లో ఇంటికి దిక్కు ఇంటిపెద్దలే.. ఆ పెద్దలే ఇలా దారితప్పితే ఆ కుటుంబం వీధినపడుతుంది. పిల్లలు అనాధలవుతారనే జ్ఞానం కూడా ఉండటం లేదు.. ఇక ఈ ఘటన తాలూకు వివరాలు తెలుసుకుంటే.. మధ్యప్రదేశ్‌లోని,  భోపాల్‌లో, భీమ్‌నగర్‌‌కు చెందిన బంటీ శాక్య, గీత అనే భార్య భర్తలు నివసిస్తున్నారు.. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. కాగా కరోనా నేపధ్యంలో లాక్‌డౌన్ ప్రకటించగా ఈ దంపతులిద్దరూ ఇంట్లోనే ఉంటున్నారు.

 

 

ఈ సందర్భంగా మద్యం స్టాక్ తెచ్చుకున్న శాక్య రోజూ తాగి భార్యతో గొడవపడుతున్నాడు. మూడురోజుల నుండి ఇది మరింత శ్రుతి మించింది. కాగా బుధవారం రాత్రి కూడా బాహా తాగొచ్చి శాక్య, భార్యతో గొడవపడ్డాడు. అయితే తెలవారితే అంతా సర్ధుకుంటుందనుకున్న ఇతని భార్య పిల్లలతో కలిసి వేరే గదిలో పడుకోగా, మనసులో కక్ష పెట్టుకున్న ఆ భర్త గురువారం తెల్లివారుజామున నిద్రలేచి కిచెన్‌లో వంటనూనె వేడిచేసి భార్యపై పోశాడు. దీంతో బాధతో ఆమె కేకలు పెట్టడంతో ఆ రాక్షసుడు పారిపోయాడు..

 

 

ఇంతలో ఈ కేకలకు చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని తీవ్రంగా గాయపడిన గీతను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, ఆమెకు 40శాతం గాయాలైనట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న జహంగీరాబాద్ పోలీసులు ఆస్పత్రికి వచ్చి బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న శాక్య కోసం గాలింపు చేపట్టారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: