లాక్ డౌన్ వల్ల దేశం మొత్తం ఇబ్బంది పడుతున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒక మంచి శుభవార్తను అందించింది. తాజాగా ఉద్యోగులకు నెలవారీ వేతనాన్ని పెంచాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఇది అందరికీ వర్తించదు. కేవలం భారతీయ రైల్వేలోని కొంత మంది ఉద్యోగులకు మాత్రమే ఈ అవకాశం లభించనుంది. దాదాపు 40,000 మంది స్టేషన్ మాస్టర్లకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా 7వ వేతన కమిషన్ పే మెట్రిక్స్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. దీని వల్ల స్టేషన్ మాస్టర్లు లెవెల్ 8 గ్రేడ్ నుంచి లెవెల్ 9కు ప్రమోట్ అవుతారు. ఈ ప్రమోషన్ కారణం ఉద్యోగుల నెలవారీ వేతనం భారీగా పెరుగుతాయి. లెవెల్ 8 ఉద్యోగులకు ప్రస్తుతం సాధారణ వేతనం 47,600/- గా ఉంది. లెవెల్ పెరగడం వల్ల వీరి వేతనం రూ.53,100కు చేరుతుంది. అంటే జీతం దాదాపు రూ.5,500 పెరగబోతోంది. లెవెల్ 9 గ్రేడ్‌కు ప్రమోషన్ మాత్రమే కాకుండా స్టేషన్ మాస్టర్లకు గెజిటెడ్ ర్యాంక్ కూడా లభించనుంది. ఇది వారికి నిజంగా మంచి శుభవార్తే !

 

ప్రమోషన్ తర్వాత స్టేషన్ మాస్టర్లకు అసిస్టెంట్ ఆపరేషన్ మేనేజర్ హోదా ఇవ్వనున్నారు. 2020 ఏప్రిల్ 1 నుండి ఈ ప్రమోషన్ అమలులోకి వస్తుంది. రైల్వే బోర్డు ఇప్పటికే దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 40 వేల మందికి ప్రయోజనం కలగనుంది. దీనితో పాటు మోదీ ప్రభుత్వం ఇంకో కీలక నిర్ణయం కూడా తీసుకోవాలని భావిస్తోందట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ వేతనాన్ని రూ.18 వేల నుంచి రూ.26,000కు పెంచాలనే ఆలోచనలో ఉంది. ఇది కూడా త్వరలో అమలు చేస్తే బాగుంటుందని ఆ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా, ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఎవ్వరూ ఊహించలేకపొతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: