ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ రోజు రోజుకు కోర‌లు చాస్తూ ఎంతో మందిని పొట్ట‌న పెట్టుకుంటోంది. ఇక ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా 200 దేశాల‌ను ట‌చ్ చేసిన ఈ వైర‌స్ దెబ్బ‌తో 6 ల‌క్ష‌ల మంది పాజిటివ్ బాధితులు అయ్యారు. ఇక ఇప్ప‌టికే ప‌లు దేశాల్లో చ‌నిపోయిన వారి సంఖ్య ఏకంగా 27 వేల‌కు చేరుకుంది. శ‌నివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఉన్న అప్‌డేట్లు చూస్తే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 6, 02, 137కు చేరుకున్నారు. ఇక చ‌నిపోయిన వారి సంఖ్య 27, 456 గా ఉంది.

 

ఇక మ‌న దేశంలో క‌రోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 3 గంట‌ల‌కు 900 దాటిన‌ట్టు లెక్క‌లు చెపుతున్నాయి. క‌రోనా వైర‌స్ భారీన ప‌డి మృతి చెందిన వారి సంఖ్య 20 గా ఉంది. ఇక ఈ వ్యాధి భారీన ప‌డి రిక‌వ‌రీ అయిన వారు 1, 33, 520 గా ఉంది. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఈ వైర‌స్‌తో బాధ‌ప‌డుతోన్న వారు 4,41,160గా ఉన్నారు. 

 

ఇక మ‌న రెండు తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే తెలంగాణ‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 59గా ఉంది. ఏపీలో ఈ సంఖ్య 13గా ఉంది. ఏపీలో ఒక్క వైజాగ్‌లోనూ మూడు పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గుంటూరులోనూ తొలి పాజిటివ్ కేసు న‌మోదు అయ్యింది. ఇక తెలంగాణ‌లో ఇప్ప‌టికే ఏకంగా 25 వేల మంది ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో క్వారంటైన్‌లో ఉన్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: