ఆడవారి పైన జరిగే అఘాయిత్యాలకు రోజు రోజుకి ఎక్కువయిపోతున్న తరుణంలో ఎటువంటి కఠినమైన శిక్షలు వచ్చినప్పటికీ ఆగడాలు మాత్రం ఎక్కడా ఆగడం లేదు. నిత్యం ఎప్పుడూ ఎక్కడో ఓ చోట మహిళలపై లైంగిక నేరాల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మంచి చెడు తేడాలేమి ఉండటం లేదు. ఆడదైతే చాలు అన్నట్లు ఉంటున్నారు కొంతమంది కామాంధులు. ఇక ఇంట్లో పొట్టకూటి కోసం పాచి పనిచేసుకునే పని మినిషిని సైతం వదలని కామాంధులు కూడా ఎందరో ఉన్నారు. అలాంటి ఘటనే ఒకటి ముంబయిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... పనిమనిషి పై కన్నేసిన ఓ వడ్డీ వ్యాపారి రుణం ఇప్పిస్తానని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. కారులోనే ఆమెపై అఘాయిత్యానానికి పాలప్పడ్డాడు ఆ నీచుడు.
ముంబైలోని 29ఏళ్ళ మహిళ ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమెకి సునిల్ గంగారామ్ అనే వడ్డీ వ్యాపారి పరిచయమయ్యాడు. రెండేళ్ల కిందట అవసరం కొద్ది అతని వద్ద రూ.50 వేలు అప్పుగా తీసుకోగా.. ఏడాది తర్వాత మరోసారి లక్షకు పైగా అప్పు చేసింది. అందుకు తన ఇంటి పత్రాలతో పాటు ఆమె బ్యాంకు చెక్కులను ఆధార్కార్డు, అన్నీ షూరిటీగా పెట్టింది. ప్రతినెలా రూ.20 వేలు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. అయితే మొత్తం ఈ ఏడాది ఫిబ్రవరి వరకు చెల్లించాలని ముందుగా గడువు పెట్టుకున్నారు.
ఆమె వద్ద డబ్బులు లేకపోవడంతో అప్పును చెల్లించలేకపోయింది. దాంతో వడ్డా ఎక్కువగా ఉండటంతో అప్పును తీర్చలేకపోయింది. అసలు వడ్డీ రెండూ కలిపి ఎక్కువ అయిపోయింది. సుమారు 5.7 లక్షలయింది. దాంతో అప్పు త్వరగా తీర్చాలంటూ బెదిరిస్తున్నాడు. ఓ రోజు అనుకోకుండా ఫోన్ చేసి ఆమెను హోటల్కి రమ్మని అక్కడికి వెళ్లాక తనకు తెలిసిన క్రెడిట్ సొసైటీ ఉందని.. తన అప్పు తీరుస్తానంటే అప్పు ఇప్పిస్తానని చెప్పాడు.
ఆమె పాపం ఎంతో ఆశతో సరే అని ఒప్పుకుని కారు ఎక్కింది. అక్కడి నుంచి క్రెడిట్ సొసైటీకి తీసుకెళ్లాడు. సొసైటీ సిబ్బంది రెండు లక్షలు లోన్ ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. తిరిగి కారులో బయలుదేరే మార్గ మధ్యలోనే సియోన్ రైల్వే స్టేషన్ దగ్గర వదలిపెడతానని కారు ఎక్కించుకున్నాడు. కారులో మధ్యలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అసభ్యంగా ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి వికృత చేస్టలు మొదలుపెడుతున్నారు. అనంతరం కారు ఆపి ఆమె పై అత్యాచారం చేశాడు. అనంతరం ఆ రైల్వేస్టేషన్ వద్ద వదిలిపెట్టేసి పరారయ్యాడు.