అమ్మాయిలకు రోజు రోజుకు సమాజంలో రక్షణ లేకుండా పోతుంది. ప్రతి రోజు ఎదో ఒక్క ప్రాంతంలో కామాంధుల చేతిలో అమ్మాయిలు బలి అవుతున్నారు. మహిళలపై అఘాయిత్యాలకు ఉరిశిక్షలు విధించినా కామాంధుల్లో కనీస భయం కలగడం లేదు. అమ్మాయిలపై కామ మృగాలగా విరుచుకుపడుతున్నారు. వారి కామానికి అమ్మాయిల నిండు జీవితాన్ని బలి తీసుకుంటున్నారు. తాజా మరో ఘటన శంషాబాద్‌ లో చోటు చేసుకుంది.

 

పొట్టకూటి కోసం సొంత ఊరును అయినా వాళ్ళను వదులుకోని వేరే ప్రాంతాలకు వెళ్తారు. వారి జానెడు పొట్ట నింపుకోవడానికి గొడ్డు చాకిరీ చేస్తారు. ఒక్క కుటుంబం కూడా బతుకుతెరువు కోసం శంషాబాద్ వచ్చింది. హోటల్లో పని చేస్తున్న బాలికపై కన్నేసిన యజమాని ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలిక అస్వస్థతకు గురి కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

 

వివరాల్లోకి వెళితే... కర్ణాటక కు చెందిన ఓ కుటుంబం బతుకు దెరువు కోసం శంషాబాద్ కి వచ్చారు. శంషాబాద్ తోండపల్లిలోని ఓ హోటల్ లో తల్లితో కలిసి కొంత కాలంగా పనిచేస్తోంది. బాలికపై కన్నేసిన హోటల్ యజమానికి ఆమె ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని చనువు పెంచుకున్నాడు.

 

ఆమెకు అప్పుడప్పుడూ వస్తువులు కొనిస్తూ లొంగదీసుకున్నాడు. అయితే వీరి అవసరాన్ని ఆసరాగా తీసుకుని యజమాని బాలికను తల్లి లేని సమయంలో బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక అస్వస్థతకు గురైంది. వెంటనే బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రి కి తరలించారు. 

 

బాలికకు మూడు నెలల గర్భవతి అని డాక్టర్ చెప్పడం తో బాలిక  తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కి గురైయ్యారు. బాలికను నిలదీయడంతో అసలు విషయం తెలిసింది. హోటల్ యజమాని పై కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: