నేటి సమాజంలో కామ వాంఛలను తీర్చుకోవడానికి కట్టుకుని భార్యా భర్త అనే తేడా లేకుండా దారుణమైన నేరాలకు పాల్పడుతున్నారు ప్రజలు. శారీరిక సుఖానికి బాగా మరిగి సొంత కొడుకులని, బిడ్డలని కూడా చంపేసి తల్లిదండ్రులు ఉన్నారంటే మనం ఎంత నీచమైన సమాజంలో బతుకుతున్నామో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఇలాంటి నీచమైన సంఘటన ఒకటి కర్ణాటక రాష్ట్రంలో జరిగి అందర్నీ విస్తుపోయేలా చేస్తోంది.

 


వివరాలిలా ఉన్నాయి... కృష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి మండలం జంబుకూడబట్టి గ్రామంలో రాజలింగం, సోనియా అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నారు. సోనియా భర్త ఒక్కడే రోజువారి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సోనియా మాత్రం ఇంట్లో పనులు చేస్తూ ఉండేది. అయితే రాజలింగం ఉదయాన్నే కూలి పనికి పోతే మళ్ళి చీకటి పడేంత వరకు ఇంటికి వచ్చేవాడు కాదు. ఈ క్రమంలోనే ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సోనియా కి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు పరిచయమయ్యాడు. పాపం, తన భర్త కుటుంబాన్ని పోషించేందుకు బయటికి వెళ్లి కాయకష్టం చేస్తుంటే... సోనియా మాత్రం తన పిల్లలు భర్త గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా స్వార్థంతో తన లైంగిక కోరికలను ఆ యువకుడితో తీర్చుకోవాలనుంది. ఒకానొక రోజు పిల్లల బడికి, మొగుడు పనికి వెళ్లిపోయారు. దాంతో సోనియా ఆ యువకుడిని ఇంటికి రప్పించుకుంది. తరువాత కామంతో కళ్లు మూసుకుపోయి అతనితో శృంగారంలో పాల్గొన్నది. వీరి జీవితంలో... రాజలింగం రోజు పనికి పోవడం ఆ తరువాత ఆమె తన రతిక్రీడలు ప్రారంభించటం డైలీ రొటీన్ అయిపోయింది. 

 

భార్య తప్పు చేస్తుంటే ఏ భర్తకైనా ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఇతనికి కూడా తన భార్య విషయం తెలియగా.. ఆమెని నిలదీశాడు. కానీ ఆమె మాత్రం చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. భార్య ప్రవర్తనతో తనకు పట్టరానంత కోపం వచ్చింది. గట్టిగా గద్దయిస్తూ రెండు దెబ్బలు వేసి ఇంకోసారి ఇలాంటివి పునరావృతం చేస్తే నీ ప్రాణాలు తీస్తా అంటూ కోపంతో ఊగిపోతూ ఆమెని హెచ్చరించాడు భర్త. అయినా ఆమె మాత్రం తన ప్రియుడితో శృంగారాన్ని అలాగే కొనసాగించింది. భార్య కామాంధురాలిగా మారడంతో ఏం చేయాలో తెలియక తనలో తానే కృంగిపోతూ ఉండేవాడు భర్త.



ఒకానొక రోజు అనగా మార్చి 13 వ తేదీన ప్రియుడి విషయంలో వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. దాంతో భర్తపై బాగా కక్ష సాధించింది సోనియా. 'వీడు బతికినంతకాలం నాకు సుఖం దక్కదు, రేపే వీడ్ని చంపేయాలి', అని సోనియా ఆ రాత్రంతా అనుకుంటూ నిద్రపోకుండా ఉంది. మర్నాడు తెల్లారిన తర్వాత భర్త యధావిధిగా తన కూలి పనికి వెళ్ళిపోయాడు. ఆ వెంటనే ఆమె తన ప్రియుడికి జరిగిందంతా చెప్పి తన భర్తని చంపేద్దామని తన మనసులోని మాటను బయటపెట్టింది. ప్రియుడు కూడా ఆమె చెప్పిన మాటలు విని తమ స్నేహితులతో కలిసి ప్లాన్ వేసుకొని రాజలింగం ఇంటికి రాగానే అతన్ని బలవంతంగా పట్టుకొని నోట్లో గుడ్డలు కుక్కి పాయిజన్ తో నిండిన ఓ సైరింజి తో ఇంజెక్షన్ వేశాడు. అంతే... రాజలింగం ఒక్కసారి కుప్పకూలిపోయి గిలగిలా కొట్టుకుంటూ చనిపోయాడు. 

 

ఆ వెంటనే తన భర్త హత్య ని ఆత్మహత్యగా మార్చేందుకు సోనియా ఆ బాడీ ని ఫ్యాన్ కి వేలాడదీసింది. పోలీసులు వచ్చిన తర్వాత కూడా మహానటి లాగా యాక్టింగ్ చేస్తూ కన్నీరుమున్నీరైంది. కానీ స్థానికుల నుండి ఆమె ఎఫైర్ గురించి తెలుసుకున్న పోలీసులు... మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. పోస్టుమార్టం నివేదికలో రాజలింగం విషం వలన చనిపోయాడు అని తేలింది. దాంతో సోనియా ని అదుపులోకి తీసుకొని విచారించగా... తానే తన భర్తని తన ప్రియుడితో కలిసి హత్య చేశానని ఒప్పుకుంది. దాంతో ఆమెను అరెస్టు చేశారు పోలీసులు. ప్రియుడు మాత్రం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా కామంతో కళ్లు మూసుకుపోయి కట్టుకున్న భర్తను చంపి పిల్లల్ని అనాధలని చేసిన సోనియా తాను ఎంత తప్పు చేసిందో జైలు జీవితం గడుపుతున్నపుడు కచ్చితంగా తెలుసుకుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: